గత కొన్ని రోజుల నుంచి నిత్యావసర వస్తువల ధరలు పెరుగుతున్నాయి. ఏ వస్తువు కొనాలన్నా చుక్కలు కపడతున్నాయి. దీనికి తోడు వంట నూనె, గ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ అయితే మాత్రం రెక్కలు వచ్చిన పక్షిలా ధరల విషయంలో ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇదిలా ఉంటే.. నిత్యావసర సరుకుల ధరలు ఎఫెక్ట్ ఇటు కూరగాయలపై కూడా పడింది.
అందులో ముఖ్యంగా టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి. మొన్నటి వరకు కిలో రూ.30 నుంచి రూ.40 వరకు పలికిన టమాటా ధరలు నేడు కిలో రూ. 100 కి విక్రయిస్తున్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లె వ్యవసాయ మార్కెట్ లో కిలో టమాట వందరూపాయలు పలికింది. ఇలా రికార్టు స్తాయిలో ధర పలకడంతో సామాన్యులు లబోదిబోమంటున్నారు.
ఆ రేట్లకు తాము ఏం కొనలేని పరిస్థితి ఏర్పడిందని.. ప్రభుత్వాలు ధరలను అదుపుచేయడంలో విఫలం అయ్యాయని విమర్శిస్తున్నారు. కర్టాటక సరిహద్దు నంచి తెచ్చిన టమాటాల్లో ఏ రకం కిలో రూ.60 నుంచి రూ. 100 పలికింది. బీ గ్రేడ్ రకం కిలో రూ.16 నుంచి రే. 58 రూపాయల వరకు ధర పలికింది.
ఇక మదనపల్లె వ్యవసాయ మార్కెట్ నుంచి తూర్పు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు టమాటాలు ఎగుమతి అవుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా కిలో టమాటా ఏకంగా రూ. 100 పలికింది. అయితే టామాటా పండించిన రైతులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో తాము తీవ్రంగా నష్టపోయామని.. ప్రస్తతం లాభాలు వస్తున్నాయని వారు అంటున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…