ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మొత్తం వచ్చేశాయి. 13 మున్సిపాలిటీలకు, ఒక కార్పొరేషన్ కు జరిగిన ఎన్నికల్లో ఈ రోజు ఫలితాలు వెల్లడయ్యాయి. మొత్తం వైసీపీ కైవసం చేసుకుంది. ఒక్క మున్సిపాలిటీ మాత్రమే టీడీపీ వశం అయిపోయింది. ప్రకాశం జిల్లాలోని దర్శి మున్సిపాలిటీని మినహాయిస్తే మిగతా అన్ని చోట్ల వైసీపీ విజయఢంకా మోగించింది.
ఇక నెల్లూరు కొర్పొరేషన్ ఎన్నికలు అయితే మొత్తం 54 స్థానాలు ఉండగా.. మొత్తం వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ.. వైసీపీ ఫ్యాన్ గాలికి తట్టుకోలేకపోయింది. దీంతో వైసీపీ శ్రేణులు ఆనందోత్సవాల మధ్య టపాసులు కాల్చతున్నారు. వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ సోషల్ మీడియా ద్వారా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజలు ప్రభుత్వానికి 100కు 97 మార్కులు వేశారన్నారు. ఈ మేరకు అతడు ట్విట్టర్ లో ఇలా ట్వీట్ చేశారు. ‘‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు… ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది.
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు’’ అంటూ సీఎం జగన్ ట్వీట్ చేశారు. ఇక కుప్పం మున్సిపాలిటీ వైసీపీ కైవసం చేసుకోవడం ప్రతీ ఒక్కరికి ఆశ్చర్యాన్ని కలిగించింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇలాకా లో వైసీపీ పాగా వేయడంతో అక్కడి వైసీపీ కార్యకర్తలకు నూతన ఉత్సాహాన్ని ఇచ్చిందనే చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…