దాదాపు చాలామంది రైల్వే ప్రయాణం చేసే ఉంటారు. అయితే రైళ్లల్లో ప్రయాణించడానికి మాత్రమే టికెట్ ఉపయోగపడుతుందని అనుకుంటారు. కానీ దాని వల్ల కలిగే ఉపయోగాలు తెలిస్తే నోరెళ్లబెడతారు. వాటి గురించి ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.. రైల్వే టికెట్ తీసుకునే క్రమంలో టికెట్ ధర కన్నా మనం 45 పైసలు అదనంగా చెల్లిస్తాం.
ఆఫ్ లైన్ లో తీసుకుంటే అది మనకు కనిపించదు. ఇంటర్ నల్ గా ఉంటుంది. కానీ మనం ఆన్ లైన్ రైలు టికెట్ బుక్ చేస్తే మాత్రం మనకు అది తెలుస్తుంది. టికెట్ బుక్ చేసే సమయంలో ఇన్సురెన్స్ తీసుకుంటారా అంటూ అడుగుతుంది. దానిని క్లిక్ చేయడమే మంచింది. ఎందుకంటే.. దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఇన్సురెన్స్ క్లయిమ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
మనిషి చనిపోతే రూ.10 లక్షలు, అంగవైకల్యం సంభవిస్తే రూ. 7.5 లక్షలు వస్తాయి. చిన్న చిన్న గాయాలతో ఆసుపత్రిలో చేరితే ఖర్చులకు రూ.2లక్షల వరకు క్లయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతే కాదు ప్లాట్ ఫాం టికెట్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. క్లాక్ రూమ్ సౌకర్యం, రెస్ట్ రూమ్, లాకర్ ఫెసిలిటీ వంటి సదుపాయాలు కూడా పొందవచ్చు.
ప్రతి ఒక్క రైల్వే ప్రయాణికుడికి ఈ సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. ట్రైన్ టికెట్ ద్వారా ఈ బెనిఫిట్స్ పొందవచ్చు. ఒక వేళ మనం జర్నీ చేసే సమయంలో ఏమైనా అనారోగ్యానికి గురయితే.. టీటీఈని అడిగి పస్ట్ ఎయిడ్ కిట్ ను కూడా తీసుకోవచ్చు. ఈ విషయాలు చాలామందికి తెలియవు. టికెట్ అంటే కేవలం ప్రయాణానికి మాత్రమే అనుకుంటారు. దీని వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి మరి.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…