ఈ మధ్య కాలంలో దేశంలో ఉన్న కొన్ని కోర్టులు సంచలన తీర్పులను వెలువరిస్తున్నాయి. ఇటీవల పంజాబ్, హర్యానా హైకోర్టు మైనర్ గా ఉన్నప్పుడు పెళ్లి చేసుకొని.. మైజర్ అయిన తర్వాత చట్టబద్దం చేసుకోవచ్చని.. అంతేకాకుండా మేజర్ అయిన తర్వాతనే విడాకులకు దరఖాస్తు చేసుకునేందుకు వెసులు బాటు ఉంటుందని తీర్పు చెప్పింది.
తాజాగా మరో సంచలన తీర్పు వెలుగులోకి వచ్చింది. అత్యాచార బాధితులకు ఉపశమనం కలిగించే తీర్పును వెలువరించింది కేరళ హైకోర్టు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భారత్ లో గర్భస్రావం చేయడం అనేది నేరంగా పరిగణిస్తారు. కొన్ని సందర్భాల్లో అది చట్టబద్దమైనదిగా కూడా పరిగణలోకి తీసుకుంటారు. తప్పని పరిస్థితుల్లో పిండాన్ని తొలగించాల్సి వచ్చినప్పుడు మాత్రమే తొలగిస్తారు.
దానికి కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. అయితే కేరళ హైకోర్టు ఓ కేసులో ఇలా తీర్పు ఇచ్చింది.. ఆమె 8 నెలల గర్భవతి. గర్భస్రావం చేయాలని వైద్యులను సంప్రదించినప్పుడు.. వైద్యులు ఇలా చేయడం నేరం అంటూ చెబుతారు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయిస్తుంది. ప్రెగ్నెన్సీ తీయించుకోవడం అనేది సదరు మహిళ సమ్మతి మాత్రమే అని.. దీనిపై తల్లిదండ్రులకు, భర్తకు ఎలాంటి అధికారం లేదని తెలిపింది.
18 ఏళ్లకంటే తక్కువ వయస్సు ఉన్న వాళ్లు గర్భవతి అయితే మాత్రం కచ్చితంగా తల్లిదండ్రుల సమ్మతి ఉండాల్సి ఉంటుంది. అయితే ఆమెకు అబార్షన్ చేసేందుకు కేరళ కోర్టు అంగీకరించింది. దానికి ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలని సూచించింది. దీంతో బాధితులకు ఇది అనుకూలమనే చెప్పాలి. కానీ కొన్ని మార్గదర్శకాలను మాత్రం పాటించాలని సూచించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…