కరోనా కోరలు చాస్తున్న వేళ దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో వలస కూలీలు, బడుగు బలహీన వర్గాలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చేయడానికి పనిలేక, తినడానికి ఆహరం దొరకని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఎందరో మహానుభావులు తమ శక్తి మేర సహాయం చేస్తున్నా ఇంకా ఎక్కడో ఒకచోట ఆహరం దొరక్క ఇబ్బందులు పడుతున్న వారు ఉన్నారు. ఇటువంటి వారికోసం ఇప్పుడు వారికి సహాయం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదివరకే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో ఎవరినీ ఆకలితో పస్తులుండనివ్వను అని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అదే క్రమంలో ఇప్పటికే అందరికి రేషన్ అందించారు.
ఇప్పుడు జిహెచ్ఎంసి పరిధిలో ఆహరం దొరక్క ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేసేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇటువంటి వారు ఒక్క ఫోన్ చేస్తే చాలు నిమిషాలలో వారికి ఆహారాన్ని అందించేలా చర్యలు చేపట్టింది. అందుకోసం ప్రత్యేకంగా 040-21111111 అనే ఫోన్ నంబర్ ను కేటాయించింది. జిహెచ్ఎంసి పరిధిలో ఆహరం దొరక్క ఇబ్బందుల్లో ఉన్నవారు ఈ ఫోన్ నంబర్ కు కాల్ చేయండి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…