తెలంగాణ సర్కార్ చాలా సంవత్సరాలుగా జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. జీవో విడుదల చేసి రాష్ట్రంలోని 126 మంది ఖైదీలకు క్షమాభిక్ష కింద విడుదల చేయడానికి సిద్ధమైంది. ఆవేశంలో చేసిన తప్పుల వల్ల అనేక సంవత్సరాలుగా జైళ్లలో మగ్గిపోతున్న 126 మంది ఖైదీల క్షమాభిక్షకు లైన్ క్లియర్ అయింది. హోం శాఖ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం వెలువడింది.
ప్రిన్సిపల్ సెక్రెటరీ రవి గుప్త అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జైళ్లశాఖ డీజీ రాజీవ్ త్రివేది, లా సెక్రటరీ సంతోష్, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. హోం శాఖ ఖైదీల క్షమాభిక్షకు సంబంధించిన ఫైల్ ను సీఎం కేసీఆర్ కు పంపగా ఆ ఫైల్ అక్కడి నుంచి కేసీఆర్ దగ్గరకు వెళ్లింది. సీఎం కేసీఆర్ ఇప్పటికే ఫైల్ పై సంతకం చేయడంతో ఖైదీల విడుదలకు లైన్ క్లియర్ అయింది.
క్షమాభిక్ష ఫైల్ పై గవర్నర్ అమోద ముద్ర వేయాల్సి ఉంది. గవర్నర్ ఆమోద ముద్ర లభిస్తే గాంధీ జయంతి సందర్భంగా 126 మంది ఖైదీలు విడుదల కానున్నారు. ప్రభుత్వం గతంలోనే ఖైదీల విడుదలకు సంబంధించిన మార్గదర్శకాలను రెండు రోజుల క్రితం విడుదల చేసింది. ప్రధాన కేంద్ర కారాగారాలలో సంవత్సరాల తరబడి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు తెలంగాణ సర్కార్ తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రయోజనం పొందనున్నారు.
రాష్ట్ర హోం శాఖ నుండి దీనికి సంబంధించిన జీవో నంబర్ 30 విడుదలైంది. సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను, వయస్సు మీద పడిన వారిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్లో క్లాసిక్గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…