Unable to bear the harassment, a software woman died after just 6 months!
హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ వద్ద తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందింది. ఆత్మహత్యకు ముందు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఆమె బ్రిడ్జ్పై నుంచి దూకి బలవన్మరణం చేసుకుంది.
వివరాల్లోకి వెళితే…
ఈస్ట్మారేడ్పల్లికి చెందిన సుష్మ (27) అనే యువతికి నేరేడ్మెట్కు చెందిన గొల్లూరు అమృత్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్తో ఈ ఏడాది జనవరి 31న వివాహం జరిగింది. ఇద్దరూ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. పెళ్లిలో సుష్మ తల్లిదండ్రులు రూ. 5 లక్షల నగదు, 6 తులాల బంగారం, అలాగే రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ కట్నంగా ఇచ్చారు.
కానీ పెళ్లి తర్వాత కొద్ది రోజులు గడవకముందే అత్తగారి ఇంటి నుంచి అదనపు కట్నం డిమాండ్లు మొదలయ్యాయి. అత్త, మామ, భర్త, మరిది అందరూ కలిసి సుష్మను మాటలతో వేధించేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వేధింపులు కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించి జూన్ 13న హాస్పిటల్లో అడ్మిట్ అయింది. అనంతరం జూన్ 16న డిశ్చార్జ్ చేసి పుట్టింటికి తీసుకెళ్లారు.
జూన్ 17న, సుష్మ తన ల్యాప్టాప్ తీసుకురావడానికి తండ్రితో కలిసి మళ్లీ అత్తింటికి వెళ్లింది. అప్పుడు కూడా అత్తింటివారు ఆమెను, తండ్రిని తీవ్రంగా దూషించారట. దీనితో తీవ్ర మనోవేదనకు గురైన సుష్మ అదే రోజు ఆఫీసుకు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీనిపై ఆమె తండ్రి ఆఫీసుకి ఫోన్ చేసి అడగగా.. ఆమె 8:30 ప్రాంతంలో వెళ్ళిపోయినట్టు కంపెనీ చెప్పగా, ఆపై తండ్రి మాదాపూర్ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు.
జూన్ 18 ఉదయం, దుర్గం చెరువులో ఒక మహిళ మృతదేహం కనిపించగా, అది సుష్మదిగా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామ, మరిదిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో నగరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఐటీ రంగంలో స్థిరపడిన, చదువుకున్న మహిళలు కూడా ఈ తరహా మానసిక వేధింపులకు బలవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పోలీసులకూ, సమాజానికీ ఇది మరో జాగ్రత్త ఉచ్చకం.
వాతావరణ మార్పులు మన ఆరోగ్యంపై నేరుగా ప్రభావం చూపుతాయని వైద్యులు చెబుతున్నారు. ఒక రోజు ఎండగా ఉండగా, మరుసటి రోజు…
40 ఏళ్ల వయస్సు దాటిన తర్వాత ఆరోగ్యంపై మరింత శ్రద్ధ అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ దశలో శరీరంలో…
మహిళా రిజర్వేషన్ అమలుకు సంబంధించిన డీలిమిటేషన్ అంశంపై రాజకీయ వాతావరణం మరింత వేడెక్కుతోంది. ఈ విషయంలో ఏపీ సీఎం ఎన్.…
అక్షయ తృతీయ సందర్భంగా కొనుగోళ్లు చేయడం శుభమనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉంది. ముఖ్యంగా బంగారం, వెండి కొనడం ఆనవాయితీగా…
పిల్లల్లో ఆటిజం (Autism) సమస్యపై అవగాహన రోజురోజుకు పెరుగుతున్నప్పటికీ, చాలా మంది తల్లిదండ్రులు ప్రారంభ లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం చేస్తున్నారు.…
తిరుమల దేవాలయం చుట్టూ ఉన్న మాడ వీధులు భక్తులకు కేవలం మార్గాలే కాదు, ఆధ్యాత్మిక సంప్రదాయానికి ప్రతీకలుగా నిలిచాయి. కలియుగ…