General News

బంగారం, నగదు, బుల్లెట్ బండి ఇచ్చినా.. వేధింపులు తట్టుకోలేక.. 6 నెలలకే సాఫ్ట్‌వేర్ మహిళ మృతి!

హైదరాబాద్‌లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్‌ వద్ద తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. అదనపు కట్నం కోసం అత్తింటి వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం చెందింది. ఆత్మహత్యకు ముందు తీవ్ర మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్న ఆమె బ్రిడ్జ్‌పై నుంచి దూకి బలవన్మరణం చేసుకుంది.

Unable to bear the harassment, a software woman died after just 6 months!

వివరాల్లోకి వెళితే…
ఈస్ట్‌మారేడ్‌పల్లికి చెందిన సుష్మ (27) అనే యువతికి నేరేడ్‌మెట్‌కు చెందిన గొల్లూరు అమృత్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌తో ఈ ఏడాది జనవరి 31న వివాహం జరిగింది. ఇద్దరూ ఐటీ రంగంలో పనిచేస్తున్నారు. పెళ్లిలో సుష్మ తల్లిదండ్రులు రూ. 5 లక్షల నగదు, 6 తులాల బంగారం, అలాగే రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ బైక్ కట్నంగా ఇచ్చారు.

కానీ పెళ్లి తర్వాత కొద్ది రోజులు గడవకముందే అత్తగారి ఇంటి నుంచి అదనపు కట్నం డిమాండ్‌లు మొదలయ్యాయి. అత్త, మామ, భర్త, మరిది అందరూ కలిసి సుష్మను మాటలతో వేధించేవారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ వేధింపులు కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించి జూన్ 13న హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. అనంతరం జూన్ 16న డిశ్చార్జ్ చేసి పుట్టింటికి తీసుకెళ్లారు.

జూన్ 17న, సుష్మ తన ల్యాప్‌టాప్ తీసుకురావడానికి తండ్రితో కలిసి మళ్లీ అత్తింటికి వెళ్లింది. అప్పుడు కూడా అత్తింటివారు ఆమెను, తండ్రిని తీవ్రంగా దూషించారట. దీనితో తీవ్ర మనోవేదనకు గురైన సుష్మ అదే రోజు ఆఫీసుకు వెళ్లిన తర్వాత తిరిగి ఇంటికి రాలేదు. దీనిపై ఆమె తండ్రి ఆఫీసుకి ఫోన్ చేసి అడగగా.. ఆమె 8:30 ప్రాంతంలో వెళ్ళిపోయినట్టు కంపెనీ చెప్పగా, ఆపై తండ్రి మాదాపూర్ పోలీసులకు మిస్సింగ్ ఫిర్యాదు చేశాడు.

జూన్ 18 ఉదయం, దుర్గం చెరువులో ఒక మహిళ మృతదేహం కనిపించగా, అది సుష్మదిగా గుర్తించారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. సుష్మ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు భర్త, అత్త, మామ, మరిదిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ఘటనతో నగరంలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఐటీ రంగంలో స్థిరపడిన, చదువుకున్న మహిళలు కూడా ఈ తరహా మానసిక వేధింపులకు బలవుతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. పోలీసులకూ, సమాజానికీ ఇది మరో జాగ్రత్త ఉచ్చకం.

telugudesk

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

2 days ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

2 days ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

2 days ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago