సాధారణంగా ఒక సినిమా తెరకెక్కించాలంటే సినిమా కథాంశాన్ని బట్టి ఆ సినిమాకు బడ్జెట్ నిర్ణయిస్తారు.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా మంది దర్శక నిర్మాతలు అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రమోషన్ చేస్తారు. అయితే నిజానికి తక్కువ ఖర్చుతో సినిమాను తెరకెక్కించినప్పటికీ, సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి దర్శక నిర్మాతలు ఈ విధంగా చెప్పడం సర్వసాధారణమే. అయితే ఇలా చెప్పడం సినిమాకు పూర్తిస్థాయిలో నష్టం వాటిల్లుతుందని తాజాగా యుగానికి ఒక్కడు సినిమా డైరెక్టర్ సెల్వ రాఘవన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
11 సంవత్సరాల క్రితం హీరో కార్తీక్ ప్రధాన పాత్రలో నటించిన యుగానికి ఒక్కడు సినిమాకు దర్శకత్వం వహించారు. ఇదే సినిమా తమిళంలో ‘ఆయిరత్తిల్ ఒరువన్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుని మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ తమిళంలో మాత్రం యావరేజ్ లిస్టులో చేరిపోయింది. ఈ సినిమా విడుదలై పదకొండు సంవత్సరాలు అయిన తర్వాత ఈ సినిమా గురించి దర్శకుడు ఓ పెద్ద సీక్రెట్ చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ 2010వ సంవత్సరంలో తెరకెక్కిన యుగానికి ఒక్కడు అనే సినిమా అప్పట్లో పద్దెనిమిది కోట్ల రూపాయలతో పూర్తి చేశాం. అయితే ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచటం కోసం ఈ సినిమా 32 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ చిత్రమని ప్రచారం చేసాము.
ఈ విధంగా 32 కోట్లు అని ప్రచారం చేయడమే పొరపాటైంది. నిజానికి ఈ సినిమాకు అయిన ఒరిజినల్
డబ్బులను ఈ సినిమా రాబట్టింది. అయితే 32 కోట్లు అని ప్రచారం చేయడంతో అంత కలెక్షన్లను సాధించలేక ఈ సినిమా యావరేజ్ లిస్ట్ లోకి చేరిపోయిందంటూ అసలు విషయాన్ని దర్శకుడు సెల్వరాఘవన్ తెలియజేశారు. ఈ సినిమా వచ్చిన 11 సంవత్సరాల తర్వాత సెల్వరాఘవన్ ఈ చిత్రానికి సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కథానాయకుడిగా ధనుష్ కీలక పాత్ర పోషిస్తున్నారు.
నేటి వేగవంతమైన జీవనశైలిలో నడుము నొప్పి ఒక సాధారణ సమస్యగా మారుతోంది. ముఖ్యంగా రోజంతా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసే…
నేటి పట్టణ జీవనశైలిలో డెంగీ ప్రమాదం కొత్త రూపం దాల్చుతోంది. ఒకప్పుడు మురుగు నీరు, చెత్త ప్రదేశాలు ప్రధాన కారణాలుగా…
సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను తాజాగా ఓ ఇంటర్వ్యూలో…
ఇంటి వంటల్లో రుచితో పాటు ఆరోగ్యం కూడా కలగాలంటే సీజనల్ కూరగాయలతో తయారయ్యే వంటకాలకు ప్రాధాన్యం ఇవ్వాలని పోషకాహార నిపుణులు…
ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో జగద్గురు ఆదిశంకరుల జయంతి ఉత్సవాలు మంగళవారం వైభవంగా నిర్వహించబడ్డాయి. వైశాఖ…
ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సహజ పదార్థాలపై మళ్లీ దృష్టి పెడుతున్నారు చాలా మంది. మన వంటింట్లో…