బాక్సాఫీసు వద్ద ఒక సినిమా విజయవంతం కావాలంటే కథను ఎంతో జాగ్రత్తగా తీర్చిదిద్ది, ప్రతి ఒక్క విషయంలో ఎన్నో మెళకువలు పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఆ పాత్రకు తగ్గ నటీనటులను ఎంపిక చేసుకోవడమే కాకుండా ఫోటోగ్రఫీ, సంగీతం వంటి విషయాలలో కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పుడే సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను సందడి చేస్తుంది.
అదేవిధంగా సినిమా ఫస్ట్ హాఫ్ అంతా హైలెట్ చేసి.. క్లైమాక్స్ కి వచ్చేసరికి సాగదీసిన, ఎమోషనల్ సెంటిమెంట్ పెట్టిన ప్రేక్షకులు అలాంటి సినిమాలను ఇష్టపడరు. మరి క్లైమాక్స్ సరిగా లేని కారణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టిన సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
శీను: టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలలో నటించి ఎంతో మంచి పేరు సంపాదించుకున్న వెంకటేష్ నటించిన శీను సినిమా క్లైమాక్స్ వచ్చేటప్పటికి ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఇందులో మూగవాడి పాత్రలో నటించినటువంటి వెంకటేష్ క్లైమాక్స్ సరిగా లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా మంచి విజయం అందుకోలేకపోయింది.
వేదం: అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క నటించిన ఈ సినిమా ఎన్నో అవార్డులను దక్కించుకుంన్నప్పటికీ క్లైమాక్స్ సరిగ్గా లేకపోవడంతో ఈ సినిమా కూడా యావరేజ్ టాక్ సంపాదించుకుంది.
చక్రం: కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన టువంటి చిత్రం చక్రం. ఇందులో క్యాన్సర్ పేషెంట్ గా నటించిన ప్రభాస్ ఓవర్ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.
భీమిలి: నాచురల్ స్టార్ నాని తన సినిమాలన్నింటిలోనూ సహజసిద్ధంగా నటించడానికి ప్రాధాన్యత ఇస్తారు.ఈ క్రమంలోనే నాని నటించిన భీమిలి కబడ్డీ జట్టు మొదటి భాగం ప్రేక్షకులను మెప్పించిన ఇప్పటికీ క్లైమాక్స్ లో నాని చనిపోవడం ప్రేక్షకులకు నిరాశ కలిగించింది.
మెరుపు కలలు: ప్రభుదేవా, కాజోల్, అరవింద స్వామి కాంబినేషన్లో వచ్చిన మెరుపు కలలు సినిమా మొదటి హాఫ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నప్పటికి క్లైమాక్స్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…