బుల్లితెర స్టార్ మాలో అత్యధిక రేటింగ్స్ కైవసం చేసుకొని దూసుకుపోతున్న సీరియల్స్ లో కార్తీకదీపం సీరియల్ ఒకటని చెప్పవచ్చు. ఈ సీరియల్ కి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా ఈ సీరియల్లో వంటలక్క, డాక్టర్ బాబు, మోనిత, సౌందర్య పాత్రలకు ఎక్కువమంది అభిమానులు ఉంటారు. వీరందరి మధ్య ఎంతో రసవత్తరంగా సాగుతున్న కార్తీకదీపం సీరియల్ లోకి ఏసీపీ పాత్రలో జ్యోతి రెడ్డి రోషిణి పాత్ర ద్వారా ఎంట్రీ ఇచ్చారు.
జ్యోతి రెడ్డి పలు సినిమాలు సీరియల్స్ లో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ ద్వారా మరింత గుర్తింపును సంపాదించుకున్న ఈమె వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం..
ఆగస్టు 4 1983 లో జ్యోతి రెడ్డి జన్మించారు. ఈమె తండ్రి బిఎస్ఎన్ ఉద్యోగి. ప్రస్తుతం మీరు హైదరాబాదులో నివాసముంటున్నారు. ఇకపోతే జ్యోతిరెడ్డి ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకుంది. వీరికి యశ్వంతో, అభిరాం అనే ఇద్దరు పిల్లలు కలరు. వీరి చిన్నబ్బాయి హైదరాబాద్లో చదువుతుండగా పెద్దబ్బాయి మలేషియాలో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తున్నారు.
చిన్నప్పటి నుంచి డాన్స్ నటనపై ఎంతో ఆసక్తి ఉన్న జ్యోతి రెడ్డి తనకు ఎంతో ఇష్టమైన డాన్స్ నేర్చుకుని సుమారు రెండు వందల స్టేజి ప్రదర్శనలు ఇచ్చింది. ఈ విధంగా తన అద్భుతమైన నటన ద్వారా ఎన్నో పురస్కారాలను కూడా అందుకుంది. ఇక తన తల్లి ప్రోత్సాహం కారణంగానే బుల్లితెర పైకి అడుగుపెట్టి ఆ తర్వాత సినిమా అవకాశాలు కూడా దక్కించుకొని పలు సినిమాలలో ఎంతో అద్భుతంగా నటిస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకొని ఇండస్ట్రీలో కొనసాగుతున్నట్లు ఓ సందర్భంలో జ్యోతి రెడ్డి వెల్లడించారు. ఒకానొక సమయంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి “ఒకే ఒక్కడు” టీవీ సీరియల్ లో నటించారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్లోని ఆస్తుల…