Unstoppable Season 2: టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ మొట్ట మొదటిసారిగా అన్ స్థాపబుల్ విత్ ఎన్బికే షోకి హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటిటీ సంస్థ ఆహా లో ప్రసారమైన ఈ షో బాగా పాపులర్ అయ్యింది. అంతేకాకుండా ఓటీటీ చరిత్రలోనే అత్యధిక వ్యూస్ తో సంచలనం సృష్టించింది. బాలయ్య ఈ షోకీ హోస్ట్ గా వ్యవహరిస్తూ తనలో ఉన్న మరొక టాలెంట్ ను ప్రేక్షకులకు పరిచయం చేసారు. కాగా ఈ షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సైతం ఎంతగానో అలరించారు. ఈ షోలో తనదైన మ్యానరిజం, డైలాగ్స్, లుక్స్, సెన్సాఫ్ హ్యూమర్ తో అలరించారు.
ఇకపోతే ఇటీవలే మొదటి సీజన్ ముగిసిన విషయం తెలిసిందే. ఇక రెండవ సీజన్ మొదలవుతుందా అని బాలయ్య అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. బాలయ్య అభిమానుల నిరీక్షణలకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. నేడు మధ్యాహ్నం 2 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది అన్ స్థాపబుల్ సీజన్ 2. ఈ షోలో మొదటి ఎపిసోడ్ కి టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, కొడుకు నారా లోకేష్ హాజరయ్యారు. మొదటి ఎపిసోడ్ కె బాలకృష్ణ వియ్యంకుల వారు హాజరు కావడంతో ఈ ఎపిసోడ్ పై అంచనాలు మరింత పెరిగాయి.
అంతేకాకుండా మొదటి ఎపిసోడ్ ప్రారంభం కాకముందే ఎందుకు సంబంధించిన టీజర్, ప్రోమో లను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుంచి బాలయ్య అభిమానుల నుంచి భారీగా స్పందన లభించింది. ఇక ఇది ఇలా ఉంటే బాలకృష్ణ తనదైన శైలిలో పంచులు కామెడీ చేస్తూ వారిని నవ్వించారు. అంతే కాకుండా గతంలో అనగా 1995లో బిగ్ డెసిషన్ కు సంబంధించిన విషయాన్ని బాలకృష్ణ అడగగా ఆ విషయం పై స్పందించిన చంద్రబాబు..1995 లో జరిగిన బిగ్ డెసిషన్ పై కీలక వాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..
ఆరోజు ఎమ్మెల్యేలు అందరూ వ్యతిరేకించారు. దీనిపై పెద్దాయనతో బాలయ్య, హరికృష్ణ, నాతో సహా మొత్తం ఐదుగురము భేటీ అయ్యాము. ఆ తర్వాత ఒక రూమ్ లో నేను, ఎన్టీఆర్ మూడు గంటలసేపు చర్చించుకున్నాం. ఆ సమయంలో నేను కాళ్లు పట్టుకొని మరి అడిగాను. చేద్దామని చెప్పాను. కానీ ఎన్టీఆర్ వినకుండా నన్ను ఒప్పించారు. మేము ఆరోజు చేసింది తప్పా అని చంద్రబాబు నాయుడు బాలకృష్ణను ప్రశ్నించగా వెంటనే స్పందించిన బాలకృష్ణ లేదు మీరు చేసింది కరెక్టే అని తెలిపాడు. అన్ స్థాపబుల్ సీజన్ 2 మొదటి ఎపిసోడ్లో భాగంగా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరోవైపు బాలకృష్ణ అభిమానులు మొదటి ఎపిసోడ్ కి రేంజ్ లో ప్రేక్షకధారణ లభించింది అంటే ఇక పోను పోను ఏ రేంజ్ లో ఉంటుందా అని అంచనా వేస్తున్నారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…