Arundhathi: అరుంధతిలో అనుష్క చేయాల్సింది కాదట..! హిట్ సినిమాకు చేజార్చుకున్న బ్యూటీ..!
Arundhathi: ‘అరుంధతి’ తెలుగు సినిమా చరిత్రలో సంచలనం. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా టాప్ హీరోలకు ధీటుగా వసూళ్లను రాబట్టింది. ఓవర్ నైట్ లో అనుష్కను స్టార్ ను చేసింది. సీనియర్ దర్శకుడు కోడి రామక్రిష్ణ డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది.
ఇప్పటికీ ఇందులోని జేజమ్మ.. క్యారెక్టర్ ని ఎవరూ మరిచిపోలేదు అంతలా తెలుగు ప్రేక్షకుల్లోకి వెళ్లింది. తమిళంలో కూడా డబ్ అయిన ఈసినిమా అక్కడా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆతరువాత పలు భాషల్లో రిమేక్ అయింది.
2009 సంక్రాంతి బరిలో నిలిచిన ఈసినిమా భారీ విజయాన్ని, కలెక్షన్లను దక్కించుకుంది. మల్లెమాల ఎంంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్యామ్ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజై నేటికి పదమూడేళ్లు పూర్తైంది. 2009 జనవరి 16న విడుదలైంది అరుంధతి సినిమాకు 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ టీవీల్లో అరుంధతి వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకే అతుక్కుపోతున్నారంటే.. సినిమా ఏ రేంజ్ హిట్ సాధించిందో మనకు అర్థం అవుతుంది.
దీంతో పాటు కోటి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జేజమ్మ సాంగ్స్ ఇప్పటికీ ఆల్ టైం హిట్స్. ఇక విలన్ గా సోనూసూద్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ‘అమ్మా.. బొమ్మాళీ’ అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ గా నిలిచిపోయింది. అనుష్కతో పాటు షియాజి షిండే, సోనూసూద్ లకు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చింది అరుంధతి. అయితే మందుగా అరుంధతి సినిమాలో హీరోయిన్ గా మలయాళ కుట్టి మమతా మోహన్దాస్ను అరుంధతి సినిమా కోసం సంప్రదించారట. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమెకు ఎలాంటి కథలు ఎంచుకోవాలో పెద్దగా తెలిసేది కాదని, దానివల్లే అరుంధతిని వదులుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో అరుంధతి క్యారెక్టర్ అనుష్కను చేరింది. ఆ సమయంలో మమతా మోహన్ దాస్ బిజీగా ఉండటం కూడా అరుంధతిని వదులుకోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది.
తమిళనాడులో డీలిమిటేషన్ బిల్లుపై రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనపై తన నిరసనను…
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో ఓ ఇంటర్ విద్యార్థి చేసిన ఫోన్ కాల్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఫలితాలు వెలువడక ముందే ఫెయిల్…
యాదాద్రి భువనగిరి జిల్లాలోని హనుమాపురం గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ కలహాల మధ్య ఓ తండ్రి…
భారతదేశంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన క్షేత్రాల్లో కాశీ ప్రత్యేక స్థానం పొందింది. అదే కాశీలో అరుదుగా దర్శనమిచ్చే దేవగురువు బృహస్పతి…
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న ప్రముఖ గాయని మంగ్లీకు సంబంధించిన మోసం ఆరోపణలు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. మైక్రో…
పార్లమెంట్లో మహిళా సాధికారతకు సంబంధించిన కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ, ప్రధాని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో…