Arundhathi: అరుంధతిలో అనుష్క చేయాల్సింది కాదట..! హిట్ సినిమాకు చేజార్చుకున్న బ్యూటీ..!
Arundhathi: ‘అరుంధతి’ తెలుగు సినిమా చరిత్రలో సంచలనం. ఓ లేడీ ఓరియంటెడ్ సినిమా టాప్ హీరోలకు ధీటుగా వసూళ్లను రాబట్టింది. ఓవర్ నైట్ లో అనుష్కను స్టార్ ను చేసింది. సీనియర్ దర్శకుడు కోడి రామక్రిష్ణ డైరెక్షన్ వచ్చిన ఈ సినిమా భారీ హిట్ కొట్టింది.
ఇప్పటికీ ఇందులోని జేజమ్మ.. క్యారెక్టర్ ని ఎవరూ మరిచిపోలేదు అంతలా తెలుగు ప్రేక్షకుల్లోకి వెళ్లింది. తమిళంలో కూడా డబ్ అయిన ఈసినిమా అక్కడా కూడా మంచి విజయాన్ని సాధించింది. ఆతరువాత పలు భాషల్లో రిమేక్ అయింది.
2009 సంక్రాంతి బరిలో నిలిచిన ఈసినిమా భారీ విజయాన్ని, కలెక్షన్లను దక్కించుకుంది. మల్లెమాల ఎంంటర్టైన్మెంట్స్ బ్యానర్పై శ్యామ్ప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా రిలీజై నేటికి పదమూడేళ్లు పూర్తైంది. 2009 జనవరి 16న విడుదలైంది అరుంధతి సినిమాకు 13 ఏళ్లు పూర్తయ్యాయి. ఇప్పటికీ టీవీల్లో అరుంధతి వస్తుందంటే ప్రేక్షకులు టీవీలకే అతుక్కుపోతున్నారంటే.. సినిమా ఏ రేంజ్ హిట్ సాధించిందో మనకు అర్థం అవుతుంది.
దీంతో పాటు కోటి అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, జేజమ్మ సాంగ్స్ ఇప్పటికీ ఆల్ టైం హిట్స్. ఇక విలన్ గా సోనూసూద్ యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.. ‘అమ్మా.. బొమ్మాళీ’ అనే డైలాగ్ ఇప్పటికీ ఫేమస్ గా నిలిచిపోయింది. అనుష్కతో పాటు షియాజి షిండే, సోనూసూద్ లకు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చింది అరుంధతి. అయితే మందుగా అరుంధతి సినిమాలో హీరోయిన్ గా మలయాళ కుట్టి మమతా మోహన్దాస్ను అరుంధతి సినిమా కోసం సంప్రదించారట. కానీ అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఆమెకు ఎలాంటి కథలు ఎంచుకోవాలో పెద్దగా తెలిసేది కాదని, దానివల్లే అరుంధతిని వదులుకున్నానని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. దీంతో అరుంధతి క్యారెక్టర్ అనుష్కను చేరింది. ఆ సమయంలో మమతా మోహన్ దాస్ బిజీగా ఉండటం కూడా అరుంధతిని వదులుకోవడానికి ఓ కారణంగా తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…