Hyderabad: తెలంగాణలో మరొక రెండు రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే బీజేపీ పార్టీ తరపున ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం కోసం ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ హైదరాబాద్లో సందడి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు మారుస్తామని దీనిని భాగ్యనగర్ గా పిలుస్తామని తెలిపారు.
ఇక్కడ భాగ్యలక్ష్మి ఆలయం ఉందని ఇది ఎంతో ప్రసిద్ధి చెందిందని అందుకే ఈ హైదరాబాద్ కి భాగ్యనగర్ అనే పేరును పెట్టబోతున్నట్లు ఈయన వెల్లడించారు. అయితే ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు కేంద్ర బిజెపి మంత్రి కిషన్ రెడ్డి కూడా మద్దతు తెలియజేశారు. అసలు ఈ హైదర్ ఎవరు ఈ హైదర్ పేరును మన భాగ్యనగర్ కు ఎందుకు పెట్టుకోవాలి అంటూ మాట్లాడారు. అయితే యోగి ఆదిత్యనాథ్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై మజ్లిస్ ఇత్తేహదుల్ ముస్లిమీన్ చీఫ్ అసదుద్దీన్ స్పందిస్తూ యోగి ఆదిత్యనాథ్ కు కౌంటర్ ఇచ్చారు.
హైదరాబాద్ మా అస్తిత్వం…
అసదుద్దీన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ భాగ్యనగర్ అనే పేరు ఎక్కడి నుంచి వచ్చిందో ముందుగా వారిని నేను ప్రశ్నిస్తున్నానని తెలిపారు. పేరు ఎక్కడ రాసి ఉన్నది? మీరు హైదరాబాద్ను ద్వేషిస్తారు. అందుకే పేరు మార్చాలని అనుకుంటున్నారు. ఇలాంటి మాటలు విద్వేషానికి ప్రతీకగా నిలుస్తున్నాయని ఈయన తెలియజేశారు.హైదరాబాద్ మా గుర్తింపు, మా అస్తిత్వం. మీరు దీని పేరు ఎలా మారుస్తారు? వాళ్లు కేవలం ద్వేష రాజకీయాలు చేస్తున్నారనీ అసదుద్దీన్ కౌంటర్ ఇచ్చారు అయితే ఇప్పుడు హైదరాబాద్ పేరు మార్చడం పట్ల యోగి వర్సెస్ అసదుద్దీన్ అనేలా మారిపోయిందని తెలుస్తోంది.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…