Urvashi Rautela: పవన్ కళ్యాణ్ జగన్ ఇద్దరిలో ఊర్వశి ఓటు ఎవరికో తెలుసా?

Urvashi Rautela: ఊర్వశి రౌతెలా ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మారుమోగిపోతున్నటువంటి పేరు. ముంబై కి చెందినటువంటి ఈమె ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో స్పెషల్ సాంగ్స్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇక ఈ మధ్యకాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్క సినిమాలో కూడా ఈమె స్పెషల్ సాంగ్ ద్వారా అందరిని సందడి చేస్తున్నారు.

ఈ క్రమంలోనే తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ హీరోలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం బ్రో ఈ సినిమాలో ఈమె మై డియర్ మార్కండేయ అనే స్పెషల్ సాంగ్ ద్వారా సందడి చేశారు. ఇక ఈ సాంగులో నటించినటువంటి ఈమె ఈ సినిమా విడుదలవుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది అంటూ ట్వీట్ చేశారు.

ఇక ఈ ట్వీట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేయగా పవన్ ఆంటీ ఫ్యాన్స్ మాత్రం ఈమె పాత వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేశారు. ఈమె గతంలో కూడా కొంతమంది హీరోలను సీఎం అంటూ సంబోధించడం గమనార్హం.అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో కలిసి సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.

Urvashi Rautela: పవన్ కళ్యాణ్ కే నా ఓటు…


ఈ క్రమంలోనే చాలామంది పవన్ కళ్యాణ్ గురించి ప్రశ్నలు వేశారు ఒకవేళ మీరు కనుక ఓటు వేయాలనుకుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వేస్తారా లేదా జగన్మోహన్ రెడ్డికి వేస్తారా అంటూ ఈమెకు ఒక ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తాను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఓటు వేస్తానని చెప్పడంతో ఈ కామెంట్స్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడమే కాకుండా పవన్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.