Varalakshmi Sarath Kumar: వరలక్ష్మి శరత్ కుమార్ పరిచయం అవసరం లేని పేరు సీనియర్ నటుడు శరత్ కుమార్ మొదటి భార్య కుమార్తెగా ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. కెరియర్ మొదట్లో హీరోయిన్ గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేదు. ఈమె బాడీ ఫిజిక్ హీరోయిన్ గా కన్నా విలన్ పాత్రలకే మంచిగా సూట్ అవ్వడంతో ఈమె వరసగా విలన్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
తెలుగులో ఈమె క్రాక్ సినిమా ద్వారా జయమ్మ పాత్రలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. దీంతో ఈమెకు వరుసగా తెలుగు అవకాశాలు వచ్చాయి. తాజాగా బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమాలో కూడా విలన్ పాత్రలో నటించి మంచి ఆదరణ సంపాదించుకున్నారు.
ఈ విధంగా వరుస సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన కొండ్రల్ పావమ్..అనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె సినిమా గురించి ఇండస్ట్రీ గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంతో కష్టపడి ఒక సినిమాను చేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత కేవలం గంటలోనే ఆ సినిమా గురించి పెద్ద ఎత్తున రివ్యూ రావడం మనం చూస్తున్నాము.
ఈ విధంగా సినిమాలకు ఇచ్చే రివ్యూల గురించి ఈమె మండిపడ్డారు.కేవలం గంటలోనే ఒక సినిమా హిట్టా.. ఫట్టా అనే విషయాన్ని రివ్యూల రూపంలో తెలియజేస్తున్నారు. అయితే పెద్ద హీరోలకు మంచిగా ఇవ్వడమే కాకుండా చిన్న సినిమాలను చిన్న హీరోల విషయంలో కంటెంట్ బాగున్నప్పటికీ చిన్న సినిమాలను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. అసలు సినిమాలకు ఇలా రివ్యూలు ఇవ్వడానికి మీరెవరు అంటూ మండిపడ్డారు ఇలా ఈమె తీవ్ర స్థాయిలో నెటిజన్స్ పై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పలువు ఈ విషయంపై స్పందిస్తూ జయమ్మకు ఎక్కడో బాగా మండినట్టు ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…