Upasana: ఇండస్ట్రీలో మెగా హీరో రామ్ చరణ్,ఉపాసన దంపతులకు ఎంతో మంచి క్రేజ్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. వీరిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా ఎంతోమందికి ఆదర్శంగా ఉంటున్నారు. ఇలా ఈ ఇద్దరు సెలబ్రిటీలకు ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇక ఉపాసన ఒకవైపు అపోలో హాస్పిటల్ బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు సోషల్ మీడియా వేదికగా ఎంతోమందికి ఆరోగ్యానికి సంబంధించిన విలువైన సూత్రాలను చెబుతూ ఉంటారు.
ఇలా సోషల్ మీడియాలో ఎంతో చురుగ్గా ఉన్నటువంటి ఉపాసన కొన్నిసార్లు తన వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటారు. ఇలా తరచూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకునే ఉపాసన తాజాగా ఒక ఫన్నీ వీడియో షేర్ చేశారు అయితే ఇందులో రామ్ చరణ్ పై ఈమె రివెంజ్ తీర్చుకుంటున్నట్లు ఉంది.
నేటిజన్స్ రామ్ చరణ్ ఉపాసనకు సంబంధించిన రెండు వీడియోలను కలిపి ఒక వీడియోగా క్రియేట్ చేశారు అయితే ఈ వీడియోని సరదాగా తీసుకున్నటువంటి ఉపాసన ఆ వీడియోని తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో వైరల్ గా మారింది.ఇక ఈ వీడియోలో ఏముందనే విషయానికి వస్తే గత కొన్ని నెలల క్రితం అల్లు రామలింగయ్య శతజయంతి వేడుకలలో భాగంగా మెగా ఫ్యామిలీ పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.
ఈ వేడుకలలో భాగంగా రామ్ చరణ్ సాయి ధరమ్ తేజ్ ఉపాసన ముగ్గురు ఒకే సోఫాలో కూర్చున్నారు. అయితే రామ్ చరణ్ ఉపాసనని పక్కకు పంపించడంతో సాయిధరమ్ తేజ్ రామ్ చరణ్ ఇద్దరూ నవ్వుకున్నారు. అయితే ఈ వీడియోకి గతంలో కరోనా సమయంలో రామ్ చరణ్ ఓ ఛాలెంజ్ చేస్తూ తన భార్య ఉపాసనకు సపర్యలు చేసిన వీడియోని కలిపి ఒక వీడియోగా క్రియేట్ చేశారు. ఈ వీడియోకి అబ్బాయిల ఫన్ అమ్మాయిల కౌంటర్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇలా ఈ వీడియో చూసినటువంటి అభిమానులు ఉపాసన రాంచరణ్ పై రివెంజ్ తీర్చుకుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…