Mrunal Thakur: సీతారామం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితమైనటువంటి నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మొదటి సినిమాతోనే ఎంతోమంది తెలుగు అభిమానులను సొంతం చేసుకున్న ఈమె ఈ సినిమా విడుదలైన ఏడాది తర్వాత మరొక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
ప్రస్తుతం ఈమె నాని హీరోగా నటిస్తున్న తన తదుపరి సినిమాలో హీరోయిన్ గా అవకాశం అందుకున్నారు. సీతారామం సినిమాలో ఎంతో పద్ధతిగా కనిపించి సందడి చేసిన ఈమె ఈ మధ్యకాలంలో గ్లామర్ షో చేస్తూ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఇకపోతే తాజాగా నటి మృణాల్ ఠాగూర్ నెటిజన్ల ట్రోలింగ్ అవుతున్నారు. ఈమె ఇలా ట్రోలింగ్ కి గురి కావడానికి గల కారణం ఆమె తనకు కాబోయే వ్యక్తి గురించి రెండు విధాలుగా సమాధానం చెప్పడమే.
గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఈమె కాబోయే వాడు ఎలా ఉండాలి అని ప్రశ్నించగా తనకు కాబోయే భర్త పెద్దగా అందంగా లేకపోయినా మంచి వాడైతే చాలు అంటూ సమాధానం చెప్పారు. అయితే తాజాగా కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొన్న ఈమెకు మరోసారి తనకు కాబోయే భర్త గురించి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ ప్రశ్నకు ఈమె సమాధానం చెబుతూ తనకు కాబోయే భర్త అందంగా ఉండాలని సమాధానం చెప్పింది.
ఈ క్రమంలోనే కొందరు నెటిజన్స్ గత వీడియోని ఈ వీడియోని జత చేస్తూ కపటత్వానికి మారుపేరు మృణాల్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ కామెంట్లపై స్పందించిన నటి నాకు కాబోయే భర్త విషయంలో గతంలో ఇప్పుడు నాకు ఉన్నటువంటి అభిప్రాయాన్ని నేను ధైర్యంగా చెప్పాను.సెలబ్రిటీలు కూడా మనుషులే అనే విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి అంటూ తన గురించి వస్తున్నటువంటి ట్రోలింగ్స్ పై ఈమె తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఇలా ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…