Venkatesh : సినీ పరిశ్రమలో ఓ సినిమా పేరు చెప్పగానే.. దాని దర్శకుడు ఎవరో దాదాపుగా చెప్పేయవచ్చు. ఆ రోజుల్లో కమర్షియల్ చిత్రాలకు పెద్దపీట వేస్తున్న తెలుగు ప్రేక్షకులు.మంచి కథతో వస్తే కళాత్మక చిత్రాలు కూడా ఆదరిస్తారని నిరూపించారు. కళాత్మక చిత్రాలంటే కళాతపస్వి కె.విశ్వనాథ్ పేరే గుర్తుకు వస్తుంది. సిరిసిరిమువ్వ, శంకరాభరణం, సాగర సంగమం, సిరివెన్నెల, స్వయంకృషి, స్వాతిముత్యం, ఈ సినిమా పేర్లు చెప్పగానే ఎవరైనా టక్కున చెప్పేపేరు కె.విశ్వనాథ్.
ఆయన తీసిన కళాత్మక చిత్రాలు ఖండాంతరాలకు వ్యాపించి అనేకమంది ప్రేక్షకాభిమానులను ఆయన సంపాదించుకోగలిగారు. ఆ సినిమాల తర్వాత వెంకటేష్ కె. విశ్వనాథ్ కాంబినేషన్లో ఒక చిత్రం వచ్చింది.
స్వర్ణకమలం కె. విశ్వనాథ్ దర్శకత్వంలో 1988లో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా. వెంకటేష్, భానుప్రియ ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాను కె.ఎస్. రామారావు సమర్పణలో భాను ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై సి.హెచ్.వి. అప్పారావు నిర్మించాడు. ఈ చిత్రానికి లోక్ సింగ్ ఛాయాగ్రాహకుడిగా, జి.జి. కృష్ణారావు ఎడిటరుగా పనిచేశారు. ఈ చిత్రానికి దర్శకుడు కె. విశ్వనాథ్ కథ,స్క్రీన్ ప్లే అందించాడు. తోటపల్లి సాయినాథ్ మాటలు రాశాడు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన పాటలకు ఇళయరాజా అందించిన ఈ చిత్ర సంగీతం శ్రోతల ఆదరణ పొందింది.
ఈ సినిమాలో కీలక భాగం కథానాయిక చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్రను భానుప్రియ పోషించగా, ఆమెకు స్ఫూర్తి కలిగించే పాత్రలో కథానాయకుడి పాత్రలో వెంకటేష్ నటించాడు. ఈ సినిమాలో కథానాయికకు స్ఫూర్తిని కలిగించే నర్తకి పాత్రలో షారన్ లోవెన్ తన నిజ జీవిత పాత్రలో నటించింది. మొదట్లో ఈ పాత్రకు యామిని కృష్ణమూర్తి, సంయుక్త పాణిగ్రాహి మొదలైన వారిని అనుకున్నారు. ఈమె ఒడిస్సీ గురువు కేలూచరణ్ మొహాపాత్రా శిష్యురాలు. ఒకసారి షారన్ దూరదర్శన్ కి ఇచ్చిన ముఖాముఖిలో ఆమెను చూసిన చిత్రబృందం ఆ పాత్ర ఈమెకు సరిపోతుందని భావించారు. ఆమెకు తర్వాత వేరే సినిమాల్లో నటించడానికి అవకాశాలు వచ్చినా మళ్ళీ నటించలేదు. ఈమె స్వతహాగా ఒడిస్సీ కళాకారిణి. కాబట్టి ఆమెకు కూచిపూడి గురువైన వెంపటి చిన్నసత్యంతో ఒక నెలరోజుల పాటు ఆ నృత్యం నేర్పించి సినిమా కోసం చిత్రీకరిద్దామనుకున్నారు. కానీ ఆమె స్వల్ప సమయంలో తాను అందులో మెలకువలు పూర్తిగా ఆకళింపు చేసుకోలేకపోవచ్చుననీ, ఇంకా ఈ సినిమా తర్వాత ఆమెను ఎవరైనా కూచిపూడి ప్రదర్శన కోసం ఆహ్వానించడం తనకు ఇష్టం లేదని తెలిపింది.
దర్శకుడు ఆమె అభిప్రాయాన్ని గౌరవించి ఒడిస్సీ నృత్యాన్నే సినిమాలో ఉంచడానికి అంగీకరించాడు. ఈ చిత్రం కోసం భారతదేశంలోని పలు ప్రాంతాల నృత్యకళాకారులు ప్రత్యక్షంగా పరోక్షంగా పనిచేశారు. విక్టరీ వెంకటేష్ స్వర్ణకమలం సినిమా నిర్మాణం గురించి మాట్లాడుతూ.. “కొత్తగా రెక్కలొచ్చిన గూటిలోని గువ్వ పిల్లకి.. అనే పాటకు ముందు భానుప్రియ సముద్రపు ఒడ్డున కూర్చుంటే సముద్రం నీరుతో గజ్జెలు కడిగి భానుప్రియ కాళ్లకు కట్టడం జరుగుతుంది.. ఆ సన్నివేశం నేను ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశానని, కానీ సినిమా విడుదల అనంతరం అలా భానుప్రియ కాలు పట్టుకోవడం ఏంటని శ్రేయోభిలాషులు, అభిమానులు నన్ను అడిగారని.. క్యారెక్టర్ డిమాండ్ మేరకే చేయడం జరిగిందని చెప్పారు. స్వర్ణకమలం చిత్రానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి అలాగే తనకు ఉత్తమ జ్యూరీ పురస్కారం లభించిడం సినిమా షూటింగ్ లో పడిన కష్టాలన్నీంటిని మైమరిపించాయని వెంకటేశ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
సినిమాల్లో కనిపించే గ్లామర్ వెనుక ఎంత కష్టముంటుందో మరోసారి నిరూపించారు బాలీవుడ్ స్టార్ కృతి సనన్. తాజాగా ఆమె నటిస్తున్న…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోగ్యం కోసం అభిమానులు, పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
టాలీవుడ్లో తన ప్రత్యేక శైలితో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు-నటుడు తరుణ్ భాస్కర్ మరోసారి వినూత్న ప్రమోషన్తో వార్తల్లో నిలిచారు. కొత్త…
కేరళ రాష్ట్రంలో ఘోర విషాదం చోటుచేసుకుంది. త్రిస్సూర్ జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడు ప్రాణనష్టం కలిగించింది.…
హైదరాబాద్ నగరంలో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసిన ఒక వ్యక్తి, గంజాయి అలవాటుతో విచిత్ర…
తెలుగు సినీ పరిశ్రమలో తన ప్రత్యేక నటనతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు అజయ్ ఘోష్, ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా…