RRR Movie: చిత్ర పరిశ్రమకు అందించే పురస్కారాలలో ఆస్కార్ పురస్కారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి ఏడాది అందించే ఈ ఆస్కార్ అవార్డులను అందుకోవాలని ప్రతి ఒక్కరూ భావిస్తారు .అయితే ఈ ఏడాది జరగబోయే ఆస్కార్ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ఇప్పటికే పలు భాషా చిత్రాలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా నామినేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
చరిత్రలో కలవని ఇద్దరు స్వాతంత్ర సమరయోధులను కలుపుతూ జక్కన్న అద్భుతమైన చిత్రాన్ని తెరకెక్కించారు. ఇలా ఈ హీరోలు నటనకు దేశవ్యాప్తంగా కాకుండా విదేశాలలో కూడా ఎంతోమంది ఫిదా అయ్యారు.ఈ క్రమంలోనే ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్ ఎన్టీఆర్ నటనలకు తప్పకుండా ఆస్కార్ రావాలంటూ వెరైటీ మ్యాగజైన్ వీరి పేర్లను ప్రచురించిన విషయం మనకు తెలిసిందే.
ఇకపోతే ఆస్కార్ అవార్డు రావాలంటే సినిమా ప్రమోషన్ కోసం భారీగా ఖర్చు చేయాలని తెలుస్తోంది. గతంలో ఆస్కార్ అవార్డులు అందుకున్న సినిమాలు కూడా భారీ స్థాయిలో ఖర్చు పెట్టాయి. ఇలా సినిమాని ప్రమోట్ చేయడం కోసం సుమారు 40 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా.
ఈ విధంగా ఆస్కార్ అవార్డు పొందడం కోసం నిర్మాతలు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తారా అనే విషయం ప్రశ్నార్థకంగా మారింది.అయితే ఒక సినిమాకి ఆస్కార్ అవార్డు రావడం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తారు కనుక బహుశా జక్కన్న నిర్మాతల చేత ఖర్చు చేయించే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 1135 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా హీరోలతో పాటు మూడు విభాగాలలో కూడా ఆస్కార్ నామినేషన్ లో ఉంది. ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…