Dhanaraj: బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో ధనరాజు ఒకరు.ఈయన ఈ కార్యక్రమంలో కంటెస్టెంట్ గా అనంతరం టీం లీడర్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. అయితే జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ధనరాజ్ ఈ కార్యక్రమం నుంచి తప్పుకున్నారు.
ఇలా జబర్దస్త్ నుంచి బయటకు వెళ్లిన ఈయన స్టార్ మా లో ప్రసారమవుతున్న పలు కార్యక్రమాలలో సందడి చేసినప్పటికీ జబర్దస్త్ అంత గుర్తింపు మాత్రం తీసుకురాలేకపోయింది.ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ధనరాజ్ జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి వెళ్ళడానికి గల కారణాలను తెలియజేశారు. ఈటీవీలో జబర్దస్త్ కార్యక్రమం కొనసాగుతున్న సమయంలో మాటీవీలోఅలీ టాకీస్ అనే ఒక కార్యక్రమం వచ్చేది అయితే కొన్ని కారణాలవల్ల ఆలీ ఈ కార్యక్రమానికి దూరమయ్యారు.
అదే సమయంలో వేణు ఆలీ టాకీస్ కార్యక్రమానికి యాంకర్ గా చేసే అవకాశం వచ్చింది. మనిద్దరం వెళ్దాం అంటూ నన్ను బలవంతం చేసే జబర్దస్త్ నుంచి బయటకు తీసుకువెళ్లారు. ఇక్కడ కామెడీ షో అది యాంకర్ గా చేయడం కనుక రెండు ఎంతో విభిన్నమైనవి అంటూ వేణు నచ్చ చెప్పారు. ఇదే విషయం జబర్దస్త్ దీప్తి గారితో చెబితే మీరు అక్కడ కనిపించి ఇక్కడ కనిపిస్తే ఎక్స్ క్లూజివ్ నెస్ పోతుందని చెప్పారు.
ఇక వేణు చెప్పిన మాటలు విని తాను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి ఆలీ టాకీస్ కార్యక్రమానికి వెళ్లామని అయితే పెద్దగా అక్కడ ఏమి కలిసి రాలేదని చెప్పారు.ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత జబర్దస్త్ కార్యక్రమానికి వస్తే టీం లీడర్ గా ఉన్నటువంటి తాము తిరిగి కంటెస్టెంట్ గా చేయాల్సి ఉంటుంది. అది నచ్చకే జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్నానని అయితే వేణు మాటలు విని నేను జబర్దస్త్ కార్యక్రమాన్ని వదిలి పెద్ద తప్పు చేశాను. ఇప్పటికీ ఈ విషయంలో తనని తిడుతూనే ఉంటానని ధనరాజ్ వెల్లడించారు.
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఎన్నో బ్లాక్బస్టర్ చిత్రాలు వచ్చినా, ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సినిమాల్లో ‘పసివాడి ప్రాణం’…
చూపు లేకపోయినా సంగీతంతో కోట్ల హృదయాలను గెలుచుకున్న గాయని వైకమ్ విజయలక్ష్మి జీవితం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. చిన్నప్పటి…
మహాభారతం భారతీయ ఇతిహాసాల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన మహాగ్రంథంగా గుర్తింపు పొందింది. ధర్మం, అధర్మం మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధం…
భారతీయ సంప్రదాయంలో రత్నాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అందులోనూ ముత్యాలు ఎప్పటినుంచో పవిత్రత, ప్రశాంతత, శుభానికి ప్రతీకగా భావించబడుతున్నాయి. తెల్లని…
వివాహం అనేది ఇద్దరి మనుషుల మధ్య బంధమే కాదు, వారి ఆలోచనలు, స్వభావాలు, జీవన విధానాల కలయిక కూడా. వేద…
హిందూ సాంప్రదాయంలో కొన్ని మొక్కలకు ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఉంటుంది. వాటిలో పారిజాతం మొక్కకు ఎంతో విశిష్ట స్థానం ఉంది.…