Venuswamy: బర్రెలక్క కెరియర్ సోషల్ మీడియా వల్లే నాశనమైంది … వేణు స్వామి కామెంట్స్ వైరల్!

Venuswamy: ఇటీవల తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా బర్రెలక్క ఎన్నికలలో నిలిచిన సంగతి మనకు తెలిసిందే. బర్రెలక్కగా ఎంతో ఫేమస్ అయినటువంటి శిరీష యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ సోషల్ మీడియాలో ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు అయితే ఈమె తెలంగాణ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా నిలబడ్డారు.

barre

ఎన్నికలలో పోటీ చేసినటువంటి ఈమె అతి తక్కువ ఓట్లతో పరాజయం పాలయ్యారు. అయితే తాజాగా ఈమె గురించి వేణు స్వామి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బర్రెలక్క వీడియోలు చేసుకుంటూ తన జీవితం తాను గడిపేదని కానీ సోషల్ మీడియా వల్ల ఆమెను కొందరు ఎన్నికల వైపు దృష్టి సారించేలా చేసి తనని ఎన్నికలలో నిలబెట్టారని తెలిపారు.

ఈ ఎన్నికలలో నిలబడటం వల్ల తాను సంపాదించుకున్నది కూడా పూర్తిగా కోల్పోయిందని వేణు స్వామి తెలిపారు. ఇలా కాకుండా తాను సైలెంట్ గా ఉండి ఉంటే కాంగ్రెస్ పాలనలో తనకు ఒక మంచి ఉద్యోగం వచ్చి ఉండేదని ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా సోషల్ మీడియానే శిరీష కెరియర్ నాశనం చేశారు అంటూ వేణు స్వామి ఈ సందర్భంగా కామెంట్లు చేశారు.


వేణు స్వామికి తప్పని ట్రోల్స్…

ఇకపోతే ఈ మధ్యకాలంలో వేణు స్వామి కూడా తన జ్యోతిష్యం కారణంగా ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోసారి తెలంగాణకు కెసిఆర్ ముఖ్యమంత్రి అవుతారని కాకుంటే నేను జ్యోతిష్యం చెప్పడమే మానేస్తానని ఈయన తెలిపారు. అయితే రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఈయన పై భారీ స్థాయిలో ట్రోల్స్ చేస్తున్నారు.