Venu Swamy: మరో ఇద్దరు హీరోలకు మరణ గండం ఉంది.. వేణు స్వామి షాకింగ్ కామెంట్స్!

Venu Swamy: ప్రముఖ ఆస్ట్రాలజర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వేణు స్వామి తరచూ సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీల గురించి రాజకీయ నాయకుల గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. వేణు స్వామి చెప్పే మాటలు నిజం కావడంతో ఈయన మాటలను నమ్మే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఇక ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన ఒక హీరో చనిపోతారని చెప్పారు.

ఈ విధంగా వేణు స్వామి ఇండస్ట్రీకి సంబంధించిన హీరో చనిపోతారని చెప్పడంతో ఈయన చెప్పిన కొద్ది రోజులకు తారకరత్న మరణించారు.ఈయన పేరు చెప్పకపోయినా హీరో అని చెప్పడంతో తారకరత్న మరణించిన తర్వాత వేణు స్వామి చెప్పిన మాటలు నిజమయ్యాయని అందరూ భావించారు.అయితే తాజాగా మరోసారి వేణు స్వామి ఇండస్ట్రీకి సంబంధించిన హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇలా ఈయన సినీ సెలబ్రిటీల గురించి మాట్లాడుతూ 2026 లోపు ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు హీరోలు చనిపోతారంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. అయితే ఈయన టాలీవుడ్ బాలీవుడ్ అని చెప్పకపోయినా ఇండస్ట్రీకి సంబంధించిన ఇద్దరు హీరోలని చెప్పడంతో వేణు స్వామి మాటలు వైరల్ అయ్యాయి దీంతో సిని ప్రేక్షకులు కాస్త కంగారు వ్యక్తం చేస్తున్నారు.

Venu Swamy: భవిష్యత్తు కోసం ప్రత్యేక పూజలు…


హీరోలు చనిపోతారంటూ చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.సినీ సెలెబ్రిటీలకు ఎంతో ముఖ్యమైన జ్యోతిష్యుడుగా నిలిచారు. ఎంతో మంది సినీ సెలెబ్రిటీలు ఈయన చేత పూజలు చేయించుకున్న సందర్భాలను మనం చూస్తున్నాము. ఇతని చేత పూజలు కనుక చేయించుకుంటే ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయని ఇప్పటికే పలువురు హీరోయిన్స్ వేణు స్వామి చేత ప్రత్యేకంగా పూజలు చేయించుకున్నారు.