నవంబర్ 2021 నుంచి.. విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ పెళ్లి గురించిన పుకార్లు.. షికార్లు చేశాయి. అవి నిజమా కాదా అని ఎంతో మంది అనుమానం వ్యక్తం చేశారు. అదే పుకార్లను నిజం చేస్తూ.. డిసెంబర్ 9, 2021న కత్రీనా , విక్కీ తమ వివాహ వేడుకకు సంబంధించి చిత్రాలను పోస్ట్ చేయడం ద్వారా అన్ని ఊహాగానాలకు ముగింపు పలికారు. ఈ పెళ్లి బాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది హాజరయ్యారు.
పెళ్లికి వెళ్తే.. ఎవరైనా గిఫ్ట్ తీసుకెళ్లడం అనేది ఎవరికైనా ఆనవాయితీ. ఇక ఈ పెళ్లిలో కూడా అతిరథ మహానటులు, నటీమణులు కూడా ఖరీదైన గిఫ్ట్ లను బహుకరించి మంత్రముగ్దులను చేసేశారు. ఆగిఫ్ట్ లు ఏంటో.. ఎవరు ఇచ్చారో ఇక్కడ తెలుసుకుందాం..విక్కీ కౌశల్ , కత్రినా కైఫ్ల వివాహానికి.. కత్రినా మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ ఆమెకు కోట్ల విలువైన డైమండ్ నెక్లెస్ను బహుమతిగా ఇచ్చాడు.
దాని విలువ ఎంతో తెలుసా.. 2.7 కోట్లు. ఆ ఖరీదైన గిఫ్ట్ చూసి కత్రినా షాకైందట. ఇక బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఈ ఇద్దరి జంటకు కలిపి రూ. 3 కోట్ల విలువైన రేంజ్ రోవర్ ను బహుమతిగా ఇచ్చాడు. బాలీవుడ్ అందాల తార ఆలియా భట్ ఫర్ఫ్యూమ్ బాస్కెట్ను గిఫ్ట్గా ఇచ్చింది. దీని విలువ దాదాపుగా లక్షల్లోనే ఉంటుందని సమాచారం. ఇవే కాకుండా.. వీరిద్దరిని ఆకట్టుకునే బహుమతులు బాలీవుడ్ పరిశ్రమ ప్రముఖుల నుంచి ఎన్నో వచ్చాయి.
షారూక్ ఖాన్ రూ.1.5లక్షల విలువ జేసే ఖరీదైన పెయింటింగ్ను గిఫ్ట్గా ఇవ్వగా.. బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ బీఎమ్డబ్ల్యూ జీ-310ఆర్ బైక్ను గిఫ్ట్గా ఇచ్చాడు. తాప్సీ.. విక్కీ కౌశల్కి విలువైన ప్లాటినం బ్రాస్లెట్ను బహుమతిగా ఇచ్చింది. దీని విలువ 1.4 లక్షలు. విక్కీ కౌశల్, తాప్సీ కలిసి గతంలో నటించారు. ఇక చివరగా.. వధువు.. వరుడి కోసం మరో గిఫ్ట్ ను ఇచ్చింది. అదేంటంటే.. కత్రినా విక్కీకి ముంబైలోని జుహులో రూ.15 కోట్ల విలువైన అపార్ట్మెంట్ను బహుమతిగా ఇచ్చింది.
దివంగత సంగీత దర్శకుడు చక్రి మరణంపై ఎన్నాళ్లుగానో వినిపిస్తున్న పుకార్లకు తెరదించిన వ్యాఖ్యలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ప్రముఖ గాయకుడు,…
ఇటీవల జీవనశైలిలో మార్పులతో పాటు కూర్చునే విధానాలపై కూడా ఆరోగ్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. ముఖ్యంగా కాళ్లు మడిచుకుని ఎక్కువసేపు…
దేవాలయంలోనూ, ఇంట్లోనూ ప్రార్థన చేసే సమయంలో చాలా మంది సహజంగా కళ్లు మూసుకుని చేతులు జోడిస్తారు. ఇది కేవలం అలవాటు…
తెలంగాణలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా సామాజిక వర్గాల మధ్య కూడా విస్తృత చర్చకు…
ప్రతి నెలా వచ్చే అమావాస్య తిథి గురించి సాధారణంగా చాలా మందిలో అశుభ భావన ఉంది. ముఖ్య పనులు, శుభకార్యాలు…
ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…