బిగ్ బాస్ 5 తెలుగు చూస్తుండగానే ముగింపు దశకు వచ్చేసింది. మరో వారం రోజుల్లోనే ఈ సీజన్కు ఎండ్ కార్డ్ పడనుంది. ప్రస్తుతం ఇంట్లో ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు. వాళ్లే ఫైనలిస్టులు అంటూ నాగార్జున అధికారికంగా ప్రకటించాడు కూడా. కాజల్ ఎలిమినేషన్ తర్వాత టాప్ 5 కంటెస్టెంట్స్ మిగిలారు. అందులో మొదట అందరికంటే ముందుగానే శ్రీరామచంద్ర ఫైనల్ చేరుకున్నాడు.
తర్వాత రెండో ఫైనలిస్టుగా సన్నీ, మూడో ఫైనలిస్టుగా సిరి హన్మంతు, నాలుగో ఫైనలిస్టుగా షణ్ముఖ్.. ఇక చివరి ఫైనలిస్టుగా మానస్ చోటు సంపాదించుకున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 5 మొదలైన మొదటి వారం నుంచే షణ్ముఖ్ పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు చాలామంది. కచ్చితంగా ఈ సీజన్ విన్నర్ అతడే అవుతాడు అని. ఎందుకంటే.. అతడి బయటక ఫ్యాన్స్ కూడా అలా ఉన్నారు.
తెలుగులో ఎక్కువగా యూట్యూబ్ ఫ్యాన్స్ ఉన్న వ్యక్తి షణ్ముఖ్. ఇక అనుకున్నట్లుగానే అతడు నామినేషన్లో మొదటి మూడు వారాలు లేడు. నాలుగో వారం నుంచి నామినేషన్లోకి రావడం మొదలైంది. అప్పుడు అందరి కంటే ఎక్కువ ఓట్లతో ముందుకు సాగాడు. అలా రెండు మూడు సార్లు అన్ అఫిషియల్ ఓటింగ్ లో మొదటిస్థానంలో కొనసాగాడు. తర్వత హౌజ్ లో జరిగిన కొన్ని పరిణామాల కారణంగా అతడి గ్రాఫ్ తగ్గుకుంటూ వచ్చింది. అనూహ్యంగా సన్నీ ముందు వరుసలోకి వచ్చాడు. ఏడో వారం నుంచి సన్నీనే టాప్ ప్లేస్ లో కనిపిస్తున్నాడు. సీజన్ మొదలైనపుడు సన్నీపై ఎవరికీ అంచనాలు లేవు.
అస్సలు సన్నీ అంటే ఎవరకీ పెద్దగా తెలియదు కూడా. రానురాను సన్నీ ఫాలోయింగ్ భయంకరంగా పెరిగిపోయింది. ముఖ్యంగా సెకండ్ సీజన్లో కౌశల్ను ఇంటి సభ్యులు ఎలాగైతే టార్గెట్ చేసి హీరోను చేసారో.. ఇప్పుడు సన్నీ విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఈయనకు ఇప్పుడు మంచి ఫాలోయింగ్ ఉంది. బయట కొన్ని యూట్యూబ్ ఛానల్లో పోల్స్ ప్రకారం చూస్తూంటే విపరీతంగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిపోయింది. దాదాపు 52 శాతంకు పైగా ఓట్లు పడుతున్నాయి.
రెండో స్థానంలో షణ్ముఖ్ 30 నుంచి 40 శాతం మధ్యలో ఉంటున్నాడు. ఇక మూడో స్థానంలో శ్రీరామ చంద్ర కొనసాగుతుండగా.. మానస్ నాలుగు.. సిరి ఐదో స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రేడ్ ప్రకారం చూస్తుంటే మాత్రం సన్నీకే గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే.. షన్ను గెలవడం నల్లేరు మీద నడకే అని చెప్పాలి.
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…
భారతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో గొప్ప స్థానం సంపాదించిన మహానుభావుల్లో రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు ప్రముఖులు. వేదాంత తత్వాన్ని ప్రజలకు సులభంగా…
తెలుగు బుల్లితెరపై విలన్ పాత్రలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రీతి నిగమ్ తాజాగా తన జీవితంలో ఎదురైన కొన్ని…
హిందూ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు అవతారాలలో ఒకటైన పరశురాముడు ప్రత్యేకమైన స్థానం పొందాడు. శౌర్యం, ధర్మ పరిరక్షణ, అన్యాయానికి వ్యతిరేకంగా…
సినీ నటి, రాజకీయ నాయకురాలిగా ప్రత్యేక గుర్తింపు సంపాదించిన రోజా మళ్లీ బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతున్నారు. కొంతకాలం విరామం…