Vijay Sethupathi: కోలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటులలో ఒకరిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు నటుడు విజయ్ సేతుపతి. ఈయన కెరియర్ మొదట్లో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన అనంతరం విలన్ గా మెప్పించారు. అలా హీరోగా అవకాశాలను అందుకొని ఇండస్ట్రీలో అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు. ఇక పాత్ర కథ డిమాండ్ చేస్తే ఈయన విలన్ పాత్రలలో నటించడానికి కూడా వెనకాడటం లేదు.
తాజాగా వచ్చిన విక్రమ్ సినిమాలో ఈయన నటన ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి ఈయన తెలుగులో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. మాస్టర్ ఉప్పెన సినిమాలలో ఈయన నటనతో తెలుగు ప్రేక్షకులను కూడా సందడి చేశారు. ఇదిలా ఉండగా తాజాగా ఈయన బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ నయనతార జంటగా తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం జవాన్.
ఈ సినిమాలో విలన్ పాత్రలో నటించడం కోసం అట్లీ విజయ్ సేతుపతిని ఎంపిక చేశారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ సేతుపతి తీసుకున్న రెమ్యూనరేషన్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఈ సినిమా కోసం ఈయన ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.ఇలా రెమ్యూనరేషన్ గురించి వార్తలు విన్న నేటిజెన్లు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.
కోలీవుడ్ ఇండస్ట్రీలో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో హీరోగా నటిస్తేనే ఈయన 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు. ఇక విలన్ పాత్రలో అంటే తప్పనిసరిగా రెమ్యునరేషన్ తగ్గుతుంది.ఉప్పెన సినిమాలో నటించినందుకుగాను ఈయనకు ఐదు కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం బాలీవుడ్ ఉన్న కష్ట పరిస్థితులలో విజయ్ సేతుపతికి ఏకంగా 21 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఇచ్చారంటే ఏ మాత్రం నమ్మశక్యంగా లేదని పలువురు భావిస్తున్నారు. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…