Vijaya Shanthi : సినిమాల్లో అగ్ర హీరోయిన్ గా అందరు హీరోలతో నటించి లేడీ సూపర్ స్టార్, లేడీ అమితాబ్ గా పేరు తెచ్చుకున్న విజయ శాంతి సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోను తనకంటూ మంచి గుర్తింపు అందుకుంది. తెలంగాణ సెపరేట్ రాష్ట్రంగా అవతరించాలన్న ఆశయంతో తల్లి తెలంగాణ పార్టీ పెట్టి పోరాడారు. రాజకీయ ఓనమాలు బీజేపీ లో నేర్చుకున్నా ఆపైన సొంత పార్టీ పెట్టి పరిస్థుల ప్రభావం వల్ల పార్టీని తెరాసలో విలీనం చేసి అటు మళ్ళీ కాంగ్రెస్ లోకి వెళ్లి చివరకు బీజేపీలో కొనసాగుతున్న రాములమ్మ తన రాజకీయ ప్రస్థానం గురించి ఇటీవల ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
కేటీఆర్ కి ప్రచారం చేసి గెలిపించాను…
1998 లో రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి మొదట బీజేపీ లో చేరి తెలంగాణ రాష్ట్ర సాధనకు పోరాడారు. ఆ పైన తెలంగాణ గురించి మాట్లాడకూడదని అప్పటి బీజేపీ మిత్ర పక్షాల నుండి ఒత్తిడి రావడం వల్ల విజయశాంతి పార్టీ నుండి బయటకు వచ్చి 2005 లో తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ఇక మారిన పరిస్థితుల్లో తెరాసలో పార్టీని విలీనం చేసాక కెసిఆర్ ఎలాంటి మోసగాడో అర్థమైందని నాకు రాజకీయ భవిష్యత్తు ఉండకూడదని చాలా ప్రయత్నించాడు అంటూ చెప్పారు.
మెదక్ ఎంపీ సీట్ నాకు ఇస్తానని చెప్పి తానే మళ్ళీ నామినేషన్ వేసాడు. మళ్ళీ నేను ఇండిపెండెంట్ గా వేయడంతో తాను విత్డ్రా చేసుకుని నాకు ఇచ్చాడు పార్టీ నుండి సీట్ అంటూ చెప్పారు. తన కొడుకు కేటీఆర్ మొదటి సారి గెలవడానికి నేనే కస్టపడ్డాను అంటూ చెప్పారు రాములమ్మ. నేను ఓడిపోవాలని కెసిఆర్ చాలా ప్రయత్నించారు అంటూ చెబుతూ కేటీఆర్ ప్రచారానికి వెళ్లిన చోట రాళ్ళ దెబ్బలు తినడంతో కెసిఆర్ నన్ను ఆ మండలాల్లో ప్రచారం చేయమన్నాడు. అంతవరకు రాళ్ళతో కొట్టినవాళ్లు రాములమ్మ రాగానే పూలను వేశారు. కేటీఆర్ అదేంటి మేడం నన్ను ప్రచారానికి వస్తే రాళ్లతో కొట్టారు మీరు రాగానే సీన్ మారిపోయింది అంటూ ఆశ్చర్య పోయాడు అంటూ తెలిపారు. తన ఎన్నికల ప్రచారాన్నీ పక్కన బెట్టి కేటీఆర్ కోసం వెళ్లానని, చాలా మండలాల్లో అసలు ప్రచారం చెయలేదని అయినా తెలంగాణ ప్రజలు గెలిపించారంటూ చెప్పారు విజయశాంతి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…