వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ చివరకు మోసపోయానని గ్రహించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీంతో పాటు తన కూతురును కాపాడండి అంటూ దిశ యాప్ లో పోలీసులకు మెసేజ్ చేసింది. చివరకు ఏం జరిగిందో తెలియాలంటే.. పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిందే.. కృష్ణాజిల్లా విజయవాడలోని న్యూరాజరాజేశ్వరి పేటకు చెందిన మహిళ ఓ బ్యాంక్ లో పనిచేస్తోంది.
ఆమెకు ఎనిమిదేళ్ల క్రితం వివాహం జరిగింది. వాళ్లకు ఒక పాప కూడా ఉంది. కొన్ని రోజుల క్రితం ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోయారు. ఆమె తన భర్తను వదిలేసి పాపతో ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలోనే తను ఉంటున్న ఇంటి పక్కనే ఉంటున్న యువకుడు అఖిల్ తో పరిచయం ఏర్పడింది. అతడు ఆమె కంటే చాలా చిన్న వాడు.
ఆమెను ప్రేమిస్తున్నానంటూ.. నమ్మించి అన్ని రకాలుగా వాడుకున్నాడు. పెళ్లి మాట ఎత్తేసరికి మాట మార్చాడు. తీరా ఆమె మోసపోయినట్లు గ్రహించి ఆత్మహత్య చేసుకోవాని నిర్ణయం తీసుకుంది. దీని కంటే ముందు తన 13 నెలల కుమార్తెను కాపాడాలంటూ దిశ యాప్ లో పోలీసులకు మెసేజ్ చేసింది. తర్వాత ఈ విషయం బయట తెలిస్తే పరువు పోతుందనే భావించి ఆమె శానిటైజర్ తాగి ఆత్మహత్యకు యత్నించింది.
ఆ మెసేజ్ కు స్పందించిన పోలీసులు 10 నిమిషాల్లోనే బాధిత మహిళ ఉంటున్న ఇంటికి చేరుకొని ఆమెను రక్షించి.. చిన్నారిని వారి బంధువులకు అప్పగించారు. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించగా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…