General News

పోలీస్ చేసిన పనికి ఫిదా అవుతున్న నెటిజన్లు.. కారణం?

సాధారణంగా ఖాకీడ్రెస్ లో ఉన్న పోలీసులను చూస్తే ప్రజలు భయంతో హడలిపోతుంటారు. వారు ప్రజల పట్ల ఎంతో కఠినంగా ప్రవర్తిస్తారనే భావన ప్రజలలో లోతుగా నాటుకుపోయింది. కరోనా కష్టకాలంలో పోలీసుల మంచితనం బయట పడటం వల్ల అందరిలో పోలీసులపై ఉన్న భావనను కరోనా చేరిపిందని చెప్పవచ్చు. వారిలో కఠినత్వం మాత్రమే కాదు, మానవత్వం కూడా ఉందని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తాజాగా ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో మరొకటి చోటుచేసుకుంది.

ప్రకాశం జిల్లా దోర్నాల మండలం మర్రెపాలెం గ్రామానికి రెండు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో ఓ అనాధ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. సమాచారం అందుకున్న దోర్నాల ఎస్సై వెంటనే ఇద్దరు కానిస్టేబుళ్లు నాగరాజు, సురేష్ లను ఈ సంఘటన స్థలానికి పంపించారు. అయితే ఆ శవాన్ని అక్కడి నుంచి తీసుకురావడానికి ఎవరు సాయంగా లేకపోవడంతో హెడ్ కానిస్టేబుల్ సురేష్ స్వయంగా ఆ శవాన్ని అటవీ ప్రాంతం నుంచి రెండు కిలో మీటర్ల దూరం వరకు మోసుకొచ్చారు.

ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితులలో ఆ శవాన్ని తీసుకు రావడానికి భయంతో ప్రజలు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ ఆటో డ్రైవర్ సహాయంతో కానిస్టేబుల్ సురేష్ ఒక కర్రకు మృతదేహాన్ని కట్టి భుజాలపై రెండు కిలోమీటర్ల దూరం వరకు మోసుకొచ్చారు. అనంతరం ఆ మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఒక అనాధ శవం పట్ల హెడ్ కానిస్టేబుల్ సురేష్ మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ శవాన్ని ఆస్పత్రికి తరలించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం ఎంతోమంది నెటిజన్లు, ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో ఈ పోలీస్ చేసిన పనికి నెటిజన్లు, ఉన్నతాధికారులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

ఊరగాయకు బూజు పట్టిందా? పారేయకండి.. ఈ సులభమైన చిట్కాలతో మళ్లీ తాజాగా మార్చుకోవచ్చు

తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…

1 day ago

హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే బెడ్ కింద వాటర్ బాటిల్ వేయాలంటున్నారు.. కారణం ఏమిటో తెలుసా?

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…

1 day ago

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ ఉద్యోగాలు..

ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…

1 day ago

టీజీ20 లీగ్‌కు రంగం సిద్ధం.. బ్రాండ్ అంబాసిడర్‌గా విజయ్ దేవరకొండ..

తెలంగాణలో క్రికెట్‌కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…

1 day ago

వ్యక్తిగత జీవితం గురించి ఓపెన్‌గా మాట్లాడిన విష్ణుప్రియ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన వ్యాఖ్యలు

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్‌గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…

1 day ago

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. 14 లక్షల మందికి పైగా రైతులకు లబ్ధి..

వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…

2 days ago