Vijayendra Prasad: సాధారణంగా ఒక సినిమా విడుదల అవుతుంది అంటే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే సినిమా విడుదలకు ముందు ఫ్రీ రిలీజ్ వేడుకను ఎంతో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా మారింది. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా పెద్ద ఎత్తున ఫ్రీ రిలీజ్ వేడుకలను నిర్వహించడం సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేయడం చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2సినిమా ఫ్రీ రిలీజ్ వేడుకను నిన్న సాయంత్రం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సినిమా ఈవెంట్లకు ఫ్రీ రిలీజ్ వేడుకలకు రావాలంటే చాలా అసహనం వేస్తుందని తెలిపారు.
సినిమా ఫ్లాప్ అవుతుందని వారి మొహాలలో స్పష్టంగా కనబడుతుంది.సినిమా ఆడదని తెలిసినా కూడా ఈ వేడుకకు హాజరై మొహమాటంగా సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంటుందని అబద్ధాలు చెప్పాల్సి ఉంటుందని విజయేంద్ర ప్రసాద్ షాకింగ్ కామెంట్స్ చేశారు.అయితే కార్తికేయ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా మాత్రం పక్కా హిట్ అవుతుందని ప్రొడ్యూసర్స్ రాసి పెట్టుకోమని ఈయన తెలిపారు.
మనసా వాచా కర్మణా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని చెప్పవచ్చు. ఈ సినిమా దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎంత వసూలు రాబడుతుందో నార్త్ ఇండస్ట్రీలో కూడా అంతే కలెక్షన్లను రాబడుతుందని ఈయన తెలిపారు.ఇందులో నిఖిల్ అనుపమ పరమేశ్వరన్ ఎంతో అద్భుతంగా నటించారని విజయేంద్ర ప్రసాద్ వారిపై ప్రశంసలు కురిపించారు. మొత్తానికి ఈ సినిమా వేడుకలో భాగంగా విజయేంద్ర ప్రసాద్ చేసిన ఈ కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…