Vilan Madhusudhan Rao : మేము సినిమాల్లోనే విలన్స్… బయట కాదు… మా అక్క పిల్లల బాధ్యత నేనే తీసుకున్నాను…: విలన్ మధుసూదన్ రావు

Vilan Madhusudhan Rao : విలన్ గా తెలుగులోనూ అటు తమిళ, కన్నడ, మలయాళంలోనూ నటిస్తున్నారు మధుసూదన్ రావు. అయితే తెలుగు ప్రేక్షకులకు మధుసూదన్ రావు అనగానే ఎవరు అని సందేహం రావొచ్చు. అయితే చక్రవాకం సీరియల్ జేమ్స్ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఆ సీరియల్ లో కూతురుని ప్రేమించే తండ్రిగా, ఒక విలన్ గా మంచి స్నేహితుడిగా చక్కగా నటించారు. అయితే సినిమాల్లో ఆశించినంత గా మంచి పాత్రలలో నటించలేదు మధుసూదన్ రావు గారు. తెలుగులో మంచి విలన్ పాత్రలు ఇంకా దొరకలేదు కానీ ఇతర భాషలలో మాత్రం మంచి విలన్ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక మధుసూదన్ గారి భార్య శృతి కూడా ఫేమస్ టెలివిజన్ నటి. మొగలిరేకులు వంటి సీరియల్ లో ‘పాటి’ పాత్రలో ఆధరగొట్టారు.

సినిమాల్లోనే విలన్ నిజ జీవితంలో కాదు…

మధుసూదన్ గారిని ఇప్పటికీ బయట తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టి జేమ్స్ అంటూ పలకరిస్తారట. ఇక ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ విలన్ పాత్రలు పోషించే ఎంతోమంది నిజ జీవితంలో చాలా సున్నితంగా ఉంటారంటు తెలిపారు. తన అక్క భర్త చనిపోవడం తో వారి బాధ్యత తానే తీసుకున్నట్లు తన అక్క, మావయ్య అంటే చాలా ఇష్టం అంటూ ఎమోషనల్ అయ్యారు. వారి బాధ్యత తీసుకోవడం వల్ల సినిమాల్లో ఏదో ఒక పాత్ర వస్తే అవి చేస్తూ వెళ్లిపోయానంటూ తెలిపారు మధుసూదన్ రావు.

ఇప్పటికీ తన మావయ్య మరణించినది గుర్తుకు వస్తే కళ్ళలో నీళ్ళొస్తాయంటూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో ఎన్నో చూసానని కానీ నా తల్లిదండ్రులు నేర్పిన మంచితనం, సహాయం పడే గుణం నాతో అలానే కొనసాగుతున్నాయంటూ తెలిపారు. నా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని అనుకోవడం లేదు నేను ఎన్నో కష్టాలు పడ్డాను అలానే కష్టాలు పడుతున్న వారికి సహాయం చేయాలనీ అనుకుంటాను. తెలుగులో అవకాశాలు బాగా రాక పోయిన తమిళంలో నన్ను బాగా ఆదరిస్తున్నారు అది చాలు నాకు అంటూ తెలిపారు మధుసూదన్ రావు.