Vilan Madhusudhan Rao : చక్రవాకం సీరియల్ లో జేమ్స్ గా సుపరిచితులైన తెలుగు నటుడు మధుసూదన్ రావు గారు ఎన్నో సినిమాల్లో విలన్ గా నటించారు. అయితే తెలుగులో దేవా కట్ట తీసిన ఆటో నగర్ సూర్య సినిమలో పూర్తి విలన్ గా నటించిన మధుసూదన్ గారు తెలుగులో ఆశించినన్ని అవకాశలు అందుకోలేదు. ఇక మధుసూదన్ గారి భార్య బుల్లితెర నటి శృతి. రుతురాగాలు సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతి ఆ తరువాత మొగలి రేకులు సీరియల్ తో విలన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్నో సీరియల్స్ లో నటిస్తూ అలానే డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను ఉన్నారు. ఇక శృతి గారి గురించి అలానే తన కెరీర్ గురించి మధుసూదన్ గారు ఆసక్తికర విషయాలను ఇంటర్వ్యూ లో పంచుకున్నారు.
పూరీ తెలుసు అయిన అవకాశాలు ఇవ్వలేదు….
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఎందుకనో అవకాశాలు అంతగా రాలేదంటూ చెప్పిన మధుసూదన్ రావు గారు. దేవకట్ట సినిమా ఆటో నగర్ సూర్య విలన్ గా అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాలో నటనకు మంచి ప్రశంసలు వచ్చాయి కానీ అవకాశాలు రాలేదు. కానీ తమిళంలో మంచి అవకాశలతో వెళ్తున్న మధుసూదన్ గారు పూరీ నాకు మంచి స్నేహితుడు భయ్య అనే పిలుస్తాను కానీ ఎందుకనో తన సినిమాల్లో నాకు అవకాశం ఇవ్వలేదు. అయితే నా భార్య కు పూరీ కుటుంబం బాగా క్లోజ్ అలా తాను నేను రికమెండ్ చేయనా అని అడిగితే వద్దని చెప్పేసాను. తన స్నేహితుడినే నేను బాగా నటిస్తున్నానని తెలుసు మరీ ఎందుకు అడగటం అని అడగలేదు. అయితే ఇస్మార్ట్ శంకర్ కి పిలిచి రెండు రోజుల షూటింగ్ అని చెప్పాడు. చిన్న క్యారెక్టర్ అని ఆలోచిస్తుంటే పూరీ నువ్వు నన్ను నమ్ము ఈ క్యారెక్టర్ నీకు ప్లస్ అవుతుంది అన్నాడు.
ఆ సినిమా తరువాత అందరు ‘ కాకా’ అని పిలవడం మొదలు పెట్టారు అంటూ మధుసూదన్ రావు ఆయన కెరీర్ గురించి పంచుకున్నారు. ఇక ఆయన పెళ్లి గురించి మాట్లాడుతూ నాది ప్రేమ వివాహమో పెద్దలు కుదుర్చిన పెళ్ళో ఇప్పటికీ నాకు క్లారిటీ లేదు అలా అయిపోయింది అంటూ తెలిపారు. రుతురాగాలు సీరియల్ టైం కి శృతి తెలిసిన పెద్దగా పరిచయం లేదు. అయితే చక్రవాకం సీరియల్ చేసే సమయంలో శృతి హీరోయిన్ కి డబ్బింగ్ చెప్పింది. అలా మళ్ళీ కలిసాను తానే ఫోన్ చేసి తనను తాను పరిచయం చేసుకుని మీరు చాలా బాగా నటిస్తున్నారంటూ చెప్పింది. అలా ఏర్పడిన పరిచయం ఎలా పెళ్లయిందో అంత డ్రామటిక్ గా అయిపోయింది అంటూ తెలిపారు.
సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…
ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగంలో ఎన్నో అభివృద్ధులు జరుగుతున్నప్పటికీ, Tuberculosis ఇంకా ప్రధాన ప్రజారోగ్య సమస్యగానే కొనసాగుతోంది. ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు,…
హిమాలయ పర్వతాల్లో వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయంలో భక్తుల కోసం కొత్త నియమాలు అమల్లోకి వచ్చాయి. ఆలయ పవిత్రతను…
జీవితంలో అదృష్టం కలిసిరావడం లేదనే భావన, ఆర్థిక ఒత్తిడులు, పనుల్లో ఆలస్యం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ఈ…
ఆహార పదార్థాల్లో కనిపించే కొన్ని సహజ పదార్థాలు ఒకేలా కనిపించినా, వాటి గుణాలు మాత్రం పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అలాంటి…
ప్రతిరోజూ కళ్లద్దాలు పెట్టుకోవడం, అవి మసకబారడం లేదా కాంటాక్ట్ లెన్స్లతో ఇబ్బందులు ఎదుర్కోవడం చాలా మందికి సాధారణ సమస్యగా మారింది.…