Vilan Madhusudhan Rao : విలన్ గా తెలుగులోనూ అటు తమిళ, కన్నడ, మలయాళంలోనూ నటిస్తున్నారు మధుసూదన్ రావు. అయితే తెలుగు ప్రేక్షకులకు మధుసూదన్ రావు అనగానే ఎవరు అని సందేహం రావొచ్చు. అయితే చక్రవాకం సీరియల్ జేమ్స్ అంటే మాత్రం టక్కున గుర్తుపడతారు. ఆ సీరియల్ లో కూతురుని ప్రేమించే తండ్రిగా, ఒక విలన్ గా మంచి స్నేహితుడిగా చక్కగా నటించారు. అయితే సినిమాల్లో ఆశించినంత గా మంచి పాత్రలలో నటించలేదు మధుసూదన్ రావు గారు. తెలుగులో మంచి విలన్ పాత్రలు ఇంకా దొరకలేదు కానీ ఇతర భాషలలో మాత్రం మంచి విలన్ పాత్రలలో నటిస్తూ మెప్పిస్తున్నారు. ఇక మధుసూదన్ గారి భార్య శృతి కూడా ఫేమస్ టెలివిజన్ నటి. మొగలిరేకులు వంటి సీరియల్ లో ‘పాటి’ పాత్రలో ఆధరగొట్టారు.
సినిమాల్లోనే విలన్ నిజ జీవితంలో కాదు…
మధుసూదన్ గారిని ఇప్పటికీ బయట తెలుగు ప్రేక్షకులు గుర్తు పట్టి జేమ్స్ అంటూ పలకరిస్తారట. ఇక ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో తన వ్యక్తిగత జీవితం గురించి చెబుతూ విలన్ పాత్రలు పోషించే ఎంతోమంది నిజ జీవితంలో చాలా సున్నితంగా ఉంటారంటు తెలిపారు. తన అక్క భర్త చనిపోవడం తో వారి బాధ్యత తానే తీసుకున్నట్లు తన అక్క, మావయ్య అంటే చాలా ఇష్టం అంటూ ఎమోషనల్ అయ్యారు. వారి బాధ్యత తీసుకోవడం వల్ల సినిమాల్లో ఏదో ఒక పాత్ర వస్తే అవి చేస్తూ వెళ్లిపోయానంటూ తెలిపారు మధుసూదన్ రావు.
ఇప్పటికీ తన మావయ్య మరణించినది గుర్తుకు వస్తే కళ్ళలో నీళ్ళొస్తాయంటూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో ఎన్నో చూసానని కానీ నా తల్లిదండ్రులు నేర్పిన మంచితనం, సహాయం పడే గుణం నాతో అలానే కొనసాగుతున్నాయంటూ తెలిపారు. నా పిల్లలకు ఆస్తులు ఇవ్వాలని అనుకోవడం లేదు నేను ఎన్నో కష్టాలు పడ్డాను అలానే కష్టాలు పడుతున్న వారికి సహాయం చేయాలనీ అనుకుంటాను. తెలుగులో అవకాశాలు బాగా రాక పోయిన తమిళంలో నన్ను బాగా ఆదరిస్తున్నారు అది చాలు నాకు అంటూ తెలిపారు మధుసూదన్ రావు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…