సాధారణంగా మత్స్యకారులు చేపల వేట నమ్ముకుని బతుకుతుంటారు.అయితే వేటకు వెళ్ళిన సమయంలో కొన్నిసార్లు మత్స్యకారులకు తీవ్ర నిరాశ ఎదురవుతూ ఉంటుంది.అదే విధంగా మరి కొన్నిసార్లు అదృష్టం తలుపు తట్టినట్టు ఎంతో అరుదైన చేపలు వలలోకి పడటంతో ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన కృష్ణాజిల్లా మత్స్యకారుల వలలో అరుదైన చేపలు పడ్డాయి. కచిలి చేపలి అనే 16 కిలోల మగ చేప, 15 కిలోల ఆడచేప దొరకడంతో మత్స్యకారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మత్స్య కారులు ఆ చేపను ఫిషింగ్ హార్బర్ కు తీసుకువచ్చారు.
ఈ అరుదైన చేపల కోసం ఫిషింగ్ హార్బర్ లో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.మార్కెట్లో ఒక చేప లక్ష రూపాయల పైగా ధర పలకగా లక్షలోపు ధర పలకడంతో ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు. ఎంతో ఖరీదు చేసే ఈ చేప ఎక్కువగా మందుల తయారీకి ఉపయోగించడం వల్ల వీటికి అధిక డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా ఈ చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో ఈ చేపలు అధిక ధర పలకడం విశేషం.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…