సాధారణంగా మత్స్యకారులు చేపల వేట నమ్ముకుని బతుకుతుంటారు.అయితే వేటకు వెళ్ళిన సమయంలో కొన్నిసార్లు మత్స్యకారులకు తీవ్ర నిరాశ ఎదురవుతూ ఉంటుంది.అదే విధంగా మరి కొన్నిసార్లు అదృష్టం తలుపు తట్టినట్టు ఎంతో అరుదైన చేపలు వలలోకి పడటంతో ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన కృష్ణాజిల్లా మత్స్యకారుల వలలో అరుదైన చేపలు పడ్డాయి. కచిలి చేపలి అనే 16 కిలోల మగ చేప, 15 కిలోల ఆడచేప దొరకడంతో మత్స్యకారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మత్స్య కారులు ఆ చేపను ఫిషింగ్ హార్బర్ కు తీసుకువచ్చారు.
ఈ అరుదైన చేపల కోసం ఫిషింగ్ హార్బర్ లో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.మార్కెట్లో ఒక చేప లక్ష రూపాయల పైగా ధర పలకగా లక్షలోపు ధర పలకడంతో ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు. ఎంతో ఖరీదు చేసే ఈ చేప ఎక్కువగా మందుల తయారీకి ఉపయోగించడం వల్ల వీటికి అధిక డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా ఈ చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో ఈ చేపలు అధిక ధర పలకడం విశేషం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…