సాధారణంగా మత్స్యకారులు చేపల వేట నమ్ముకుని బతుకుతుంటారు.అయితే వేటకు వెళ్ళిన సమయంలో కొన్నిసార్లు మత్స్యకారులకు తీవ్ర నిరాశ ఎదురవుతూ ఉంటుంది.అదే విధంగా మరి కొన్నిసార్లు అదృష్టం తలుపు తట్టినట్టు ఎంతో అరుదైన చేపలు వలలోకి పడటంతో ఒక్కసారిగా లక్షాధికారులుగా మారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు ఎన్నో జరిగాయి. తాజాగా ఇలాంటి ఘటన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటుచేసుకుంది.
తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది మినీ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన కృష్ణాజిల్లా మత్స్యకారుల వలలో అరుదైన చేపలు పడ్డాయి. కచిలి చేపలి అనే 16 కిలోల మగ చేప, 15 కిలోల ఆడచేప దొరకడంతో మత్స్యకారులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే మత్స్య కారులు ఆ చేపను ఫిషింగ్ హార్బర్ కు తీసుకువచ్చారు.
ఈ అరుదైన చేపల కోసం ఫిషింగ్ హార్బర్ లో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు.మార్కెట్లో ఒక చేప లక్ష రూపాయల పైగా ధర పలకగా లక్షలోపు ధర పలకడంతో ఒక్కసారిగా లక్షాధికారిగా మారిపోయాడు. ఎంతో ఖరీదు చేసే ఈ చేప ఎక్కువగా మందుల తయారీకి ఉపయోగించడం వల్ల వీటికి అధిక డిమాండ్ ఏర్పడింది. అదేవిధంగా ఈ చేపలను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయడంతో ఈ చేపలు అధిక ధర పలకడం విశేషం.
సినీ తారల వ్యక్తిగత జీవితంపై ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేక ఆసక్తి ఉంటుంది. వారి రోజువారీ అలవాట్లు, కుటుంబ సంబంధాలు, ఇంటి…
డిజిటల్ యుగంలో ఫోక్ సాంగ్స్కు పెరుగుతున్న ఆదరణతో పాటు, కొత్త టాలెంట్కు కూడా విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. ఈ ట్రెండ్లోనే…
సినీ పరిశ్రమలో ప్రతిభ ఒక్కటే సరిపోదు.. అదృష్టం కూడా తోడైతేనే కెరీర్ సాఫీగా సాగుతుంది. ఇదే విషయాన్ని మరోసారి గుర్తు…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన మగధీర సినిమా టాలీవుడ్లో మైలురాయిగా నిలిచిన…
ప్రసిద్ధ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, సినిమా ప్రయాణం, అలాగే ప్రముఖ నటుడు జూనియర్…
హైదరాబాద్ నుంచి హుబ్లీకి బయల్దేరిన ఫ్లై91 ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య పరిస్థితుల్లో నాలుగు గంటల పాటు గాల్లోనే తిరుగుతూ…