Vishwak Sen-Tharun Bhasker: దేశంలో మరోసారి కరోనా వైరస్ భయాందోళనలను గురిచేస్తోంది. తగ్గినట్లే తగ్గి చాప కింద నీరులో ఒక్కసారిగా విరుచుకుపడుతోంది. దీంతో సెలెబ్రిటీల దగ్గర నుంచి సామన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఈ కరోనా మహమ్మరికి గురి అవుతున్నారు. మొన్నటి వరకు డెల్టా వేరియంట్ తో వ్యాప్తి చెందిన ఈ కరోనా కొత్తగా.. ఒమిక్రాన్ లా రూపాంతరం చెంది.. ప్రస్తుతం ప్రపంచాన్ని అతలా కుతలం చేసేస్తోంది.
ఈ మహమ్మారి ఇండియాలోకి కూడా ప్రవేశించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రజలతో సహా అన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో అటు బాలీవుడ్ తో పాటు ఇటు దక్షిణాది చిత్రసీమల్లోని కొందరు ప్రముఖులు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పుడు టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో విశ్వక్ సేన్ కు కరోనా సోకింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా విశ్వక్ సేన్ వెల్లడించారు.
అతడు తన ఇన్ స్టాగ్రామ్ లో ఇలా రాసుకొచ్చాడు.. ‘‘నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వైద్యుడి సలహా మేరకు అన్ని నిబంధనలను పాటిస్తూ ప్రస్తుతం స్వీయనిర్బంధంలో ఉన్నాను. వ్యాక్సిన్ వేసుకున్నప్పటికీ ఈ వైరస్ సోకడం దురదృష్టకరం. దయచేసి అందరూ మాస్కు ధరించండి. జాగ్రత్తగా ఉండండి. నాపై మీ ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు” అని విశ్వక్ సేన్ రాశాడు.
అయితే ఇదే పోస్టును తెలుగు యంగ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ తన ఇన్ స్టాలో పోస్టు చేశాడు. అతడిని నేను ముడు రోజుల క్రితం కలిశాను అని.. థ్యాంక్స్ రే విశ్వక్.. వాట్ ఏ ఫ్రెండ్ అంటూ పోస్టు టాప్ లో రాసి.. దాని కింద అతడు ఇలా రాశాడు.. ‘‘ఈ పోస్టు చదవగానే దగ్గొస్తుంది నాకు’’ అంటూ రాశాడు. దానికి రిప్లై ఇస్తూ విశ్వక్ సేన్ కూడా తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు.. ‘‘అబ్బా సాయిరాం.. ఐ యామ్ సో హ్యాపీ నౌ’’ అంటూ కింద @tharunbhaskar ట్యాగ్ చేశాడు. అయితే ఇదే పోస్టును మళ్లీ.. విశ్వక్ సేన్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశాడు.
ప్రస్తుతం ఆ స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక తరుణ్ భాస్కర్ విషయానికి వస్తే.. అతడు పెళ్లిచూపులు సినిమాకు దర్శకుడిగా పని చేశాడు. ఆ తర్వాత విశ్వక్ సేన్ హీరోగా ‘ఈ నగరానికి ఏమైంది’కి దర్శకత్వం వహించాడు. తర్వాత ఫలక్ నుమా దాస్ లో అతడు నటించాడు. ఇలా విశ్వక్ సేన్ కు.. తరుణ్ భాస్కర్ కి మథ్య స్నేహం ఏర్పడింది. దీంతో వీరిద్దరు ఎక్కడికి వెళ్లినా.. కలిసే వెళ్తారు. ఇటీవల ఆహాలో మొదలైన గేమ షో లో కూడా కలిసే పాల్గొన్నారు.
తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన ఏడాది వయసున్న చిన్నారి ఆర్యాన్ష్ ప్రస్తుతం అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. చిన్న వయసులోనే…
బెంగళూరులో మూడు నెలల క్రితం చోటుచేసుకున్న ఆరేళ్ల చిన్నారి వెన్నెల మృతి కేసు తాజాగా సంచలన మలుపు తిరిగింది. మొదట…
ఇటీవలి కాలంలో ఆహార భద్రతపై ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ముఖ్యంగా కూరగాయలు, పండ్లలో రసాయనాల వినియోగంపై తరచూ వార్తలు వెలువడుతుండటంతో…
హైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లు అనారోగ్యానికి గురై చికిత్స…
ప్రపంచ వాతావరణ పరిస్థితులపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న…
తెలుగు బుల్లితెరపై ప్రసారమైన ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఢీ’ ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన పండు మాస్టర్, తన డ్యాన్స్…