అమ్మతనం ఎంతో అపురూపమైనది. అలాంటి అమ్మే తన బిడ్డ పట్ల కర్కశంగా ప్రవర్తిస్తే ఆ బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం. తాజాగా విశాఖలో ఓ కన్న తల్లి తన బిడ్డను అమ్ముకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. విశాఖ గోపాలపట్నం లక్ష్మీనగర్లో నివాసముంటున్న ఓ యువతి పెళ్లి కాకుండానే గర్భం దాల్చింది. నెలలు నిండిన తర్వాత ఏప్రిల్ 19న ఆ యువతి కేజీహెచ్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
మగ బిడ్డకు జన్మనిచ్చిన ఆ యువతికి పెళ్లి కాకుండానే తల్లి కావడంతో ఆమెలో భయం వెంటాడింది.కుటుంబ ఆర్థిక పరిస్థితులు అంతంతమాత్రంగానే ఉండడంతో తన బిడ్డ పోషణ బరువవుతుందని భావించిన ఆ యువతి ఆసుపత్రిలోనే తన బిడ్డను ఇతరులకు అమ్మేసింది. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్ళగానే తన గర్భం గురించి, ప్రసవం గురించి ఇరుగు-పొరుగు ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
ఇరుగు పొరుగు వారు అడిగే ప్రశ్నలకు తన బిడ్డ మరణంతో పుట్టాడని అబద్ధం చెప్పింది. ఈ విషయం కాస్తా ఐసీడీఎస్ అధికారిణికి తెలియడంతో ఆమెను పిలిపించి ప్రశ్నించగా ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పడంతో వారికి ఆ యువతి పై అనుమానాలు కలిగాయి. దీంతో ఐసీడీఎస్ అధికారిణి నిజం చెప్పాలి లేకపోతే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించడంతో ఆ మహిళ జరిగిన విషయం బయటపెట్టింది.
ఆర్థిక ఇబ్బందుల వల్ల తన బిడ్డను ఆస్పత్రిలోనే ఇతరులకు అమ్మినట్లు అసలు విషయం బయట పెట్టడంతో అమ్మిన ఆ బిడ్డను తిరిగి తీసుకొచ్చారు. ఐసీడీఎస్ అధికారిణి, వాలంటీర్, మహిళా కానిస్టేబుల్ శిశువును మర్రిపాలెంలోని ప్రభుత్వ శిశు గృహానికి శనివారం అప్పగించారు
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…