దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి లక్షణాలు ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. కొందరిలో కరోనా వైరస్ కు సంబంధించిన లక్షణాలు కనిపిస్తుంటే మరి కొందరికి వైరస్ సోకినా ఎటువంటి లక్షణాలు కనిపించడం లేదు. కరోనా వైరస్ ఒక్కొక్కరిలో ఒక్కో తరహా లక్షణాలు చూపించటానికి గల కారణాలు శాస్త్రవేత్తలకు కూడా తెలియలేదు. అయితే తాజాగా పరిశోధనల్లో లక్షణాలు కనిపించకపోవడానికి అసలు కారణం వెలుగులోకి వచ్చింది.
అమెరికాలోని ఓ బృందం కరోనా వైరస్ పై పరిశోధనలు చేసి కీలక విషయాలను వెల్లడించింది. ప్రత్యేకమైన కారణం వల్లే కొంతమందిలో లక్షణాలు కనిపించడం లేదని పేర్కొంది. కరోనా సోకినా లక్షణాలు కనిపించకపోవడానికి వైరస్ లో ఉండే స్పైక్ ప్రోటీన్ కారణం. స్పైక్ ప్రోటీన్ నాడీ మండలానికి నొప్పి సంకేతాలను పంపే రిసెస్టర్లను నిర్వీర్యం చేస్తుంది. ఫలితంగా లక్షణాలు లేని వాళ్లు వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నా ఇతరులకు వైరస్ సోకడం లేదు.
శరీరంలోని ఏసీఈ రిసెప్టర్లలో మొదట ఈ వైరస్ సోకుతుందని శాస్త్రవేత్తల పరిశోధనల్లో వెల్లడైంది. ది జర్నల్ పెయిన్ అనే పత్రికలో ఈ పరిశోధనకు సంబంధించిన కథనాలు ప్రచురితమయ్యాయి. స్పైక్ ప్రోటీన్ నొప్పి ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. శరీరంలో నొప్పిని కలగజేసే వీఈజీఎఫ్ ఏ ప్రోటీన్ కు ఈ ప్రోటీన్ కు సంబంధం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడిస్తున్నారు.
అమెరికాకు చెందిన డాక్టర్ రాజేష్ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలన్ తెలిపారు. వైరస్ గురించి మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కరోనా లక్షణాలు కొందరిలో కనిపించి, కొందరిలో కనిపించక పోవడంపై ఇంతకాలం భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజా పరిశోధనలతో ఆ ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే అని చెప్పవచ్చు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…