Thammareddy Bharadwaja: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న తమ్మారెడ్డి భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన నిర్మాతగా మంచి గుర్తింపు సంపాదించుకోవడమే కాకుండా నటుడిగా కూడా పలు సినిమాలలో నటించారు.ఈ క్రమంలోనే తమ్మారెడ్డి భరద్వాజ్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా టికెట్ల వ్యవహారం పై ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా సినిమా టికెట్ల రేట్లపై ఇండస్ట్రీలో ఉన్న సమస్య గురించి మీ సమాధానం , అభిప్రాయం ఏంటి అంటూ ఆయన అని ప్రశ్నించగా అసలు ఇండస్ట్రీలో సమస్య లేదనేది తన ఉద్దేశమని ఈయన తెలియజేశారు.సినిమా టికెట్ల రేట్లను తగ్గించడం వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు.
సినిమా టికెట్ల రేట్లను తగ్గించినప్పుడు పెద్ద సినిమా నిర్మాతలు చాలా నష్టపోతారనే విషయాన్ని ప్రస్తావనకు తీసుకురాగా ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ్ క్లారిటీ ఇచ్చారు. పాన్ ఇండియా స్థాయిలో నిర్మించిన చిత్రాలకు భారీ బడ్జెట్ అయ్యింది. అయితే ఈ పాన్ ఇండియా చిత్రాలు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రమే విడుదల కాలేదు. దేశ వ్యాప్తంగా కొన్ని వేల థియేటర్లలో విడుదల అవుతున్నాయి కనుక సినిమా రేటు తగ్గించిన ఈ సినిమా అత్యధిక వసూళ్లను రాబడుతోంది. అదే కాకుండా చిన్న బడ్జెట్ సినిమాలే అయితే కేవలం రెండు రాష్ట్రాలలో మాత్రమే విడుదల అవుతాయి కనుక ఈ సినిమాలకు కూడా ఎలాంటి ఇబ్బంది లేదు.
ఇలా పాన్ ఇండియా సినిమాలు దేశ వ్యాప్తంగా విడుదల కావడంతో ఆ సినిమాలకు కూడా ఎలాంటి నష్టం లేదని నా దృష్టిలో ఇండస్ట్రీలో ఏ విధమైనటువంటి సమస్యలు లేవని ఆయన వెల్లడించారు. ఇన్ని రోజులు ఏ విషయాన్ని బయటకు ప్రస్తావించక మౌనంగా ఉండి పోతుంటే ఎవడికి వాడు రెచ్చిపోతున్నారు వీళ్ళందర్నీ చూస్తుంటే తిక్క రేగుతుంది అంటూ తమ్మారెడ్డి ఇ వెల్లడించారు. ఇక ముఖ్యంగా చిరంజీవి మహేష్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలు టికెట్ల రేట్లను పెంచమని ముఖ్యమంత్రిని అడుక్కోవడం దారుణమని ఈయన తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…