Lunula: మీ చేతివేలి గోర్ల పై ఉన్న గుర్తులను బట్టి మీరు ఏ వ్యాధితో బాధపడుతున్నారో ఇట్టే గుర్తుపట్టవచ్చు?
Lunula: సాధారణంగా మన చేతి వేలి గోళ్లను బట్టి మన ఆరోగ్యం ఏవిధంగా ఉంటుందో అంచనా వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యం మొత్తం మన చేతి వేలి గొర్లలోనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన చేతి గోటిపై అర్ధచంద్రాకారపు వలయాలు కనబడుతుంటాయి. వీటి ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయవచ్చు.
సాధారణంగా ఇలా చేతి గోర్ల పై అన్ని వేళ్ళకు అర్ధచంద్రాకారంలో తెల్లని వలయం ఉంటుంది. దీనిని లునులా అంటారు. ఎవరికైతే గోళ్లపై లునులా ఉండదో వాళ్ళు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. ఇలాంటివారు పౌష్టికాహార లోపం అదేవిధంగా థైరాయిడ్ గ్రంధి లోపం రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని అర్థం. ఎవరికైతే గోళ్లపై లునులా పెద్దగా ఉంటుందో అలాంటి వారు ఎంతో ఆరోగ్యవంతంగా ఉన్నారని అర్థం.
ఇక గోర్ల పై లునులా చిన్నగా ఉండే వారిలో జీర్ణక్రియ సమస్యలు ఉండడమే కాకుండా శరీరంలో పెద్ద ఎత్తున వ్యర్థాలు పేరుకుపోయాయని రక్తప్రసరణ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం లేదని అర్థం. ఇక కొందరికి ఈ లునులా నీలిరంగులో లేదా పాలిపోయినట్టు కనబడుతుంటాయి. ఇలా ఉండే వారు త్వరలోనే డయాబెటిస్ బారిన పడతారని అర్థం. ఈ విధంగా చేతి గోళ్ళ పై సుమారు 8 వేళ్ళకు లునులా ఉంటే ఆ వ్యక్తి ఎంతో ఆరోగ్యంగా ఉన్నారని అర్థం.ఎనిమిది కంటే తక్కువగా ఉన్న వారిలో విటమిన్ల లోపం ఉందని వీరు శరీరానికి సరిపడే ఆక్సిజన్ సరఫరా కావడం లేదని అర్థం.
ఇలాంటి వారు ప్రతిరోజు పౌష్టికాహారం తీసుకుంటూ సరైన వ్యాయామాలు చేయాలని నిపుణులు చెబుతున్నారు.ఇక కొందరిలో గోళ్లు పసుపు రంగులో ఉంటాయి. ఈ విధంగా పసుపు రంగులో ఉన్న వారు ఎక్కువగా ఫంగల్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నట్టు అర్థం. అయితే ఎక్కువగా నెయిల్ పాలిష్ వేసుకునే వారి గోళ్లు పసుపు రంగులో ఉంటాయి.ఇలా ఎక్కువ రోజులపాటు గోళ్లు పసుపు రంగులోకి కనబడితే వెంటనే వైద్యుని సంప్రదించి సరైన చికిత్స తీసుకోవడం ఎంతో అవసరం.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…