బాలకృష్ణ-బోయపాటి కాంబినేషన్ లో థియేటర్లలో సందడి చేస్తున్న అఖండ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఈ సినిమా విడుదలై మూడు రోజులు అయినప్పటికీ ఇంకా థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. చాలా కాలం తర్వాత థియేటర్ల ముందు పండుగ వాతావరణం నెలకొంది.
ఇక ఇందులో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో నటించి ప్రేక్షకులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే థియేటర్లు జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున నినాదాలు వినబడుతున్నాయి. ఇకపోతే ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకోవడంతో చిత్ర బృందం డిసెంబర్ 8వ తేదీ సక్సెస్ మీట్ నిర్వహించాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే అఖండ సక్సెస్ మీట్ కు ఇద్దరు స్టార్ హీరోలు రాబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ క్రమంలోనే అఖండ సక్సెస్ మీట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు రాబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ కార్యక్రమానికి వచ్చారు. ఇక ఎన్టీఆర్ మహేష్ బాబు మధ్య మంచి రిలేషన్ ఉన్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే అఖండ సక్సెస్ మీట్ లో ఇద్దరు స్టార్ హీరోల సందడి చేయనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉంది అనే విషయం తెలియాల్సి ఉంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…