Featured

పిండ ప్రధానం కాకులకే ఎందుకు పెడతారు..?

సాధారణంగా మన హిందూ సాంప్రదాయాలు ఎన్నో ఆచారాలు పాటిస్తుంటారు. ఇందులో భాగంగానే చనిపోయిన తర్వాత చనిపోయిన వారికి పిండం ప్రధానం చేయడం కూడా ఒక ఆచారంగానే వస్తుంది. అదే విధంగా ప్రతి పుష్కరాలకు లేదా సంవత్సరం రోజు చనిపోయిన వారికి పిండ ప్రధానం చేయడం మనం చూస్తూనే ఉంటాం.అయితే ఈ పిండప్రధానం చేసేటప్పుడు మనం మన పితృదేవతలకు సమర్పించిన పిండాన్ని కాకులు తినాలని భావిస్తుంటారు. ఆ విధంగా కాకులు తినడం ద్వారా మన పితృదేవతలకు ఆత్మ శాంతి కలుగుతుందని నమ్మకం. అయితే పిండాన్ని కాకులకి ఎందుకు పెడతారు? ఆ విధంగా కాకులకు పెట్టడానికి గల కారణం ఏమిటి అనే విషయాలను గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పురాణాల ప్రకారం రావణాసురుడుకి భయపడిన యమధర్మరాజు కాకులకు ఒక వరం ఇస్తాడు. ఎవరైతే చనిపోయి ఉంటారో వారు నరకానికి వెళ్లి బాధలను అనుభవిస్తుంటారు. అలాంటి వారికి నరక బాధలు నుంచి విముక్తి కలగాలంటే వారి కుటుంబ సభ్యులు పిండప్రధానం చేసినప్పుడు కాకుల ఎవరి పిండాన్ని అయితే తింటాయో వారికి నరక బాధల నుంచి విముక్తి కలుగుతుందనే వరాన్ని ప్రసాదిస్తాడు. అందువల్ల పిండ ప్రదానం చేసే టప్పుడు కాకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.

ఈ విధంగా ప్రతిసారీ పిండప్రదానం చేసినప్పుడు కాకులు ఆ పిండాన్ని తినకపోతే తమ పితృ దేవతలకు ఏవో తీరని కోరికలు ఉన్నాయని, వారి ఆత్మకు శాంతి ఇ కలగలేదని భావిస్తుంటారు. అయితే కొందరు మాత్రం పూర్వకాలంలో పశుపక్ష్యాదులకు ఆహారంగా ఈ పిండ ప్రదానం చేసే వారని,అప్పట్లో కాకులు ఎక్కువగా ఉండటం వల్ల ఈ పిండాన్ని కాకులు తినేవి. అప్పటి నుంచి ఇప్పటికీ వరకు పిండాన్ని కాకులు తినడం ఒక ఆచారంగా పాటిస్తున్నారని మరి కొందరు భావిస్తుంటారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

రాత్రి తలుపు మూసి నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?

రాత్రి నిద్ర నాణ్యత మన రోజువారీ ఆరోగ్యంపై ఎంత ప్రభావం చూపుతుందో తెలిసిందే. అయితే చాలా మందికి ఒక సాధారణ…

1 hour ago

పసుపు అరటి కాదు… ఎర్ర అరటి తింటేనే అసలు హెల్త్ సీక్రెట్!

మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…

9 hours ago

విశాఖలో విషాదం.. యువతి ఆత్మహత్య కేసులో ఆరుగురు అరెస్ట్

విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…

9 hours ago

ఫోన్‌తో టాయిలెట్‌లో గడిపితే… మీ శరీరం చెల్లించాల్సిన ధర ఇదే!

ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…

10 hours ago

టాలీవుడ్‌కు ఘట్టమనేని వారసుడి ఎంట్రీ.. హీరోయిన్ బ్యాక్‌గ్రౌండ్ హాట్ టాపిక్

తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…

10 hours ago

కేరళ సీఎంకు లేఖ.. మోనాలిసా కేసులో కొత్త ట్విస్ట్

‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…

10 hours ago