Featured

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా ఇవి పాటించాల్సిందే..!

సాధారణంగా పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎక్కువ అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. మగవారి కన్నా ఆడవారిలో ఎక్కువగా కీళ్లనొప్పుల సమస్యలు, ముఖ్యంగా నెలసరి సమస్యలు మహిళలను వెంటాడుతుంటాయి. ఈ సమస్యల వల్ల వారు ఎంతో సతమతమవుతుంటారు. ఇలాంటి అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలగాలంటే తప్పకుండా కొన్ని చిట్కాలు పాటించాలని నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే మహిళల ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇక్కడ తెలుసుకుందాం.

మహిళలలో ఎక్కువగా నెలసరి సమస్య వచ్చినప్పుడు అధికంగా కడుపు నొప్పిని కలుగజేస్తుంది.ఈ విధంగా బహిష్టు సమయంలో నొప్పి కలగడానికి గల కారణం హార్మోన్ల అసమతుల్యత అని చెప్పవచ్చు. ఈ సమస్య నుంచి విముక్తి పొందాలంటే మహిళలు తీసుకునే ఆహారంలో మొదటి ముద్ద నువ్వుల పొడితో కలిపి తీసుకోవటం వల్ల హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి బహిష్టు సమయంలో నొప్పిని కలిగించకుండా ఉంటుంది. నెలసరి సమయంలో అధిక రక్తస్రావం జరగడం వల్ల రక్తహీనత సమస్యలు తలెత్తుతుంటాయి.ఈ విధంగా అధిక రక్తస్రావంతో బాధపడే వారు వీలైనంత వరకు ఐరన్ పుష్కలంగా లభించే ఆహార పదార్థాలను తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.

రాత్రి పడుకునే సమయంలో అరగ్లాసు గోరువెచ్చని పాలలో టేబుల్ టీస్పూన్ పటిక బెల్లం చూర్ణం కలుపుకొని తాగడం వల్ల నిద్రలేమి సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. వారానికి రెండు సార్లైనా మెంతికూరను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల నెలసరి క్రమంగా వస్తుంది. నిమ్మరసం తాగడం అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా తులసి ఆకుల టీని తీసుకోవడం వల్ల రొమ్ము క్యాన్సర్ నుంచి విముక్తి పొందవచ్చు. అన్నం తక్కువగా తీసుకుని ఆకుకూరలను,కూరగాయలను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైనన్ని పోషకాలు అందుతాయి. ఈ విధమైన ఈ చిట్కాలను పాటించడం వల్ల మహిళలు ఎంతో ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago