సీఎం కేసీఆర్ ఆశీస్సులతో గెల్లు గెలుపు ఖాయం_ మంత్రి హరీష్

హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రధాన పోటీ టిఆర్ఎస్ బిజెపి మధ్యే ఉంటుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రజా ఆశీర్వాద సభ లో మంత్రి మాట్లాడారు. బీజేపీలో చేరిన తర్వాత ఈటల కొత్త భాష నేర్చుకుంటున్నారని హరీశ్ అన్నారు. ఆస్తుల కోసం వామపక్ష భావాలను, సిద్ధాంతాలను వదులుకుని బీజేపీలో చేరారన్నారు . నీ భాష మారినా.. మేము మాత్రం నిన్ను రాజేందర్ గారూ అనే సంబోదిస్తాం అని హరీశ్ పేర్కొన్నారు.

హుజరాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్తులతో గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని హరీశ్ జోస్యం చెప్పారు. రాష్ట్రంలో మరో రెండేళ్లు ఉండేది టిఆర్ఎస్ ప్రభుత్వం అని.. అభివృద్ధి సంక్షేమం జరగాలంటే ప్రజలంతా టిఆర్ఎస్ ని గెలిపించాలని హరీష్ కోరారు.