గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో కొడుకు చనిపోయిన ఎనిమిది నెలల తరువాత తల్లికి సూసైడ్ నోట్ లభించింది. ఆ సూసైడ్ నోట్ లో ఉన్న విషయాలను తెలుసుకుని షాకవ్వడం తల్లి వంతయింది. కోడలు వల్లే కొడుకు చనిపోయాడని తెలిసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మాధవ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవనం సాగించేవాడు.
వివాహం జరిగిన తర్వాత మాధవ్ కు కొన్ని శారీరక సమస్యలు తలెత్తాయి. దీంతో మాధవ భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కళ్ల ముందే భార్య అలా చేయడంతో తట్టుకోలేకపోయిన మాధవ్ 2019 సంవత్సరం ఏప్రిల్ నెలలో సూసైడ్ నోట్ రాసుకున్నాడు. అయితే చనిపోవాలని అనుకున్నప్పటికీ మాధవ్ కు చనిపోవడానికి ధైర్యం చాలలేదు. ఆ సూసైడ్ నోట్ ను మాధవ్ ఇంట్లో కప్ పోర్డ్ లో ఉంచాడు.
సూసైడ్ నోట్ రాసిన ఏడాది తరువాత 2020 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన మాధవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నిరోజుల క్రితం మాధవ్ తల్లి లీలా జాదవ్ ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో మాధవ్ కప్ బోర్డ్ ను పరిశీలించగా సూసైడ్ నోట్ లభ్యమైంది. మాధవ్ తన భార్యకు, ఆమె ప్రియునికి చాలాసార్లు చెప్పినా వినలేదని.. నిత్యం వాళ్లు తనను అవమానించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
విషయం తెలిసిన మాధవ్ తల్లి ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే పరోక్షంగా మాధవ్ ఆత్మహత్యకు కారణమైన మాధవ్ భార్యను, మాధవ్ భార్య ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తరువాత మాధవ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
కేరళలోని ప్రముఖ రిటైల్ స్పేస్ కంపెనీ హైలైట్ గ్రూప్ తన 30వ వార్షికోత్సవం సందర్భంగా ఉద్యోగులను అదిరిపోయే విధంగా సర్ప్రైజ్…
టీమిండియా నెక్స్ట్ జనరేషన్ స్టార్, 14 ఏళ్ల క్రికెట్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు మోస్ట్ టాక్డ్ పేర్లలో ఒకరు.…
సర్పంచులకు ఉపశమనం.. నిలిచిన నిధుల వినియోగానికి అనుమతి ఆంధ్రప్రదేశ్లో గ్రామ పంచాయతీలకు సంబంధించి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. Government of…
ఉత్తరప్రదేశ్లోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. బహ్రైచ్ జిల్లాలోని నంద్వాల్ గ్రామానికి చెందిన 35 ఏళ్ల గర్భిణి ప్రసవ…
తెలుగు చిత్రసీమలో కంటెంట్ ఆధారిత కథలను ఎంచుకుంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు తన కెరీర్లో సుహాస్ ఇప్పుడు…
టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గా గుర్తింపు పొందిన రెబల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన వ్యక్తిగత వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…