గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో కొడుకు చనిపోయిన ఎనిమిది నెలల తరువాత తల్లికి సూసైడ్ నోట్ లభించింది. ఆ సూసైడ్ నోట్ లో ఉన్న విషయాలను తెలుసుకుని షాకవ్వడం తల్లి వంతయింది. కోడలు వల్లే కొడుకు చనిపోయాడని తెలిసిన ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. పూర్తి వివరాల్లోకి వెళితే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ లో మాధవ్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవనం సాగించేవాడు.
వివాహం జరిగిన తర్వాత మాధవ్ కు కొన్ని శారీరక సమస్యలు తలెత్తాయి. దీంతో మాధవ భార్య మరో వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. కళ్ల ముందే భార్య అలా చేయడంతో తట్టుకోలేకపోయిన మాధవ్ 2019 సంవత్సరం ఏప్రిల్ నెలలో సూసైడ్ నోట్ రాసుకున్నాడు. అయితే చనిపోవాలని అనుకున్నప్పటికీ మాధవ్ కు చనిపోవడానికి ధైర్యం చాలలేదు. ఆ సూసైడ్ నోట్ ను మాధవ్ ఇంట్లో కప్ పోర్డ్ లో ఉంచాడు.
సూసైడ్ నోట్ రాసిన ఏడాది తరువాత 2020 సంవత్సరం ఏప్రిల్ 8వ తేదీన మాధవ్ ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నిరోజుల క్రితం మాధవ్ తల్లి లీలా జాదవ్ ఇల్లు శుభ్రం చేస్తున్న సమయంలో మాధవ్ కప్ బోర్డ్ ను పరిశీలించగా సూసైడ్ నోట్ లభ్యమైంది. మాధవ్ తన భార్యకు, ఆమె ప్రియునికి చాలాసార్లు చెప్పినా వినలేదని.. నిత్యం వాళ్లు తనను అవమానించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నానని సూసైడ్ నోట్ లో పేర్కొన్నాడు.
విషయం తెలిసిన మాధవ్ తల్లి ఈ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇప్పటికే పరోక్షంగా మాధవ్ ఆత్మహత్యకు కారణమైన మాధవ్ భార్యను, మాధవ్ భార్య ప్రియుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పోలీసుల దర్యాప్తు తరువాత మాధవ్ ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
వయస్సు పెరుగుతున్న కొద్దీ శరీరంలో కొన్ని మార్పులు సహజమే. అయితే ఇటీవల చాలా మందిలో కనిపిస్తున్న ఒక సమస్య నిపుణులను…
మన రోజువారీ వంటకాలలో నూనెకు ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం అల్పాహారం నుంచి రాత్రి భోజనం వరకు దాదాపు ప్రతి…
మన దేశంలో చిన్నపిల్లల్లో తరచుగా కనిపిస్తున్న ఆరోగ్య సమస్యల్లో రక్తహీనత ఒకటి. ముఖ్యంగా ఐదేళ్లలోపు పిల్లల్లో, అలాగే రెండు సంవత్సరాల…
2026 ఏప్రిల్ 15 బుధవారం రోజుకు సంబంధించిన రాశి ఫలితాలు ఈ రోజు గ్రహస్థితుల ప్రభావంతో కొన్ని రాశుల వారికి…
గుజరాత్లోని సారంగపుర్ ప్రాంతంలో వెలసిన కష్టభంజన్ దేవ్ హనుమాన్ ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆంజనేయస్వామి క్షేత్రాల్లో ఒకటి. భక్తులు…
విదేశాల్లో మంచి ఉద్యోగం అనే ఆశతో నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని భారీ మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ను హైదరాబాద్ పోలీసులు బయటపెట్టారు.…