ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో మనకు తెలిసిందే. ఎంతో ఆరోగ్యవంతులను కూడా ఉన్నఫలంగా కరోనా మహమ్మారి బలి తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కరోనా తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలోనే ఓ నిండు గర్భిణీ కరోన బారినపడి కరోనాను ఎదిరించి పోరాడింది. ఈ వైరస్ తో పోరాడి పండంటి బిడ్డకు జన్మనివ్వడంతో అందరూ ఆనందంగా ఉన్న సమయంలో ఆ పసిగుడ్డుకి తల్లిని దూరం చేసిన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
విజయవాడలోని సింగ్ నగర్ కుచెందిన వెంకటేశ్వరరావు, రమాదేవి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. వీరిలో చిన్న కుమార్తె ప్రమీల తనతో పాటు బ్యాంకులో ఉద్యోగం చేసే గణేష్ అనే యువకుణ్ణి ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. గత ఏడాది వీరి వివాహం కాగా ఈ ఏడాది ప్రమీల గర్భం దాల్చి గత మూడు నెలల క్రితమే డెలివరీ కోసం పుట్టింటికి వచ్చేసింది.
గత నెలలోకుటుంబ సభ్యులందరూ కరోనా బారిన పడటంతో ప్రమీలాకి కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ తన బిడ్డను రక్షించుకోవడం కోసం కరోనాను జయించి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఒక వైపు కరోనా నెగిటివ్ రావడమే కాకుండా పండంటి మగ బిడ్డకు జన్మనివ్వడంతో కుటుంబ సభ్యులందరూ ఎంతో సంతోషపడ్డారు. ఈ క్రమంలోనే ప్రమీల తన బాబుని తీసుకొని అత్తారింటికి వెళ్ళింది.
అంతా సవ్యంగా ఉందనుకునే సమయంలో ప్రమీల తల్లి రమాదేవి కరోన బారినపడి మృత్యువాత పడ్డారు. అయితే ఈ విషయం ప్రమీలకు తెలియనివ్వకుండా కుటుంబ సభ్యులు జాగ్రత్తపడ్డారు. కానీ మంగళవారం తన తల్లి మరణవార్తను తెలుసుకున్న ప్రమీల ఉన్నఫలంగా కుప్పకూలిపోయింది. ఈ క్రమంలోనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించేలోగా ప్రమీల మృత్యువాత పడింది. ఒకరోజు వ్యవధిలోనే ఇటు భార్యను అట కూతురిని పోగొట్టుకున్న వెంకటేశ్వరరావు ఎంతో రోదన చెందాడు. ఈ క్రమంలోనే రెండు వారాల పసిబిడ్డకు తల్లి దూరం కావడంతో సింగ్ నగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…