Women are angry at Ashok Gajapathi Raju for trying to take back the land given in 1999!
విజయనగరం: త్వరలో గవర్నర్గా బాధ్యతలు స్వీకరించనున్న అశోక్ గజపతిరాజుపై విజయనగరంలో మహిళలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1999లో తాను రైతు బజార్కు ఇచ్చిన స్థలాన్ని తిరిగి తనకు అప్పగించాలని ఆయన ఆదేశాలు జారీ చేయడంతో సుమారు 50 కుటుంబాల జీవనం అగమ్యగోచరంగా మారింది.
ఏమిటీ వివాదం?
1999లో అశోక్ గజపతిరాజు అనుమతితో, ఎమార్వో ఆఫీస్ సమీపంలో ఒక ఎకరం 48 సెంట్ల విస్తీర్ణంలో రైతు బజార్ను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఆ స్థలంలో సుమారు 50 కుటుంబాలు రైతు బజార్ను నమ్ముకుని జీవనం సాగిస్తున్నాయి. అయితే, ప్రస్తుతం భూముల రేట్లు భారీగా పెరగడంతో, తాను ఇచ్చిన స్థలాన్ని సాయంత్రానికల్లా ఖాళీ చేయాలని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
కలెక్టర్కు ఆదేశాలు..
ఈ స్థలాన్ని ఖాళీ చేయించి తనకు అప్పగించాలని కోరుతూ అశోక్ గజపతిరాజు జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్కు ఆదేశాలు జారీ చేశారు. అశోక్ గజపతిరాజు నిర్ణయంతో తమ జీవనాధారం కోల్పోతామని ఆందోళన చెందుతున్న రైతు బజార్లోని మహిళలు, వ్యాపారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం విజయనగరంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Cheating Wife : వివాహ బంధం పవిత్రమని భావించే సమాజంలో అక్రమ సంబంధాల కారణంగా జరుగుతున్న ఘటనలు తరచూ సంచలనం…
హైదరాబాద్లోని అత్తాపూర్ ప్రాంతంలో ప్రముఖ స్వీట్ షాప్పై ఆహార భద్రతకు సంబంధించిన ఆరోపణలు సంచలనం రేపాయి. పేరుగాంచిన బ్రాండ్గా గుర్తింపు…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ను కలవాలంటే 42 నిబంధనలు పాటించాల్సి ఉంటుందంటూ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో నెట్టింట వైరల్ అయిన…
తెలుగు సినీ ప్రపంచాన్ని ఒకప్పుడు కుదిపేసిన హీరోయిన్ ప్రత్యూష మృతి కేసులో ఎట్టకేలకు సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. దాదాపు…
ఆంధ్రప్రదేశ్లో డ్వాక్రా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. స్వయం సహాయక సంఘాల సభ్యులైన మహిళలకు…
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ అంథ్రోపిక్ (Anthropic) భారత్లోకి అధికారికంగా ప్రవేశిస్తోంది. సోమవారం సంస్థ విడుదల చేసిన…