Writer Kanagala Jayakumar : అలనాటి తార సావిత్రి హీరోలకు ధీటుగా స్టార్ డమ్ ని సంపాదించుకున్న హీరోయిన్. హీరోలకు సమానంగా అభిమానులను సంపాదించుకున్న మహానటి కొంతమంది హీరోలను స్క్రీన్ మీద తన నటనతో డామినేట్ చేసేది. అందం, అభినయం, వ్యక్తిత్వం అన్నీ కలగలసిన ఏకైక హీరోయిన్ గా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చిరస్తాయిగా మిగిలిన తార. పేదరికం నుండి వచ్చిన సావిత్రి గారు ఆ తరువాత సినిమాల్లో నటన ద్వారా కొన్ని వేల కోట్ల ఆస్తులను సంపాదించారు. కానీ చివరి దశలో అదే పేదరికంలో మరణించారు. కానీ ఆమె గొప్పతనం ఇప్పటికీ ఎంతో మంది సినిమా తారలు గుర్తుచేసుకుంటూ ఉంటారు. ఆమె తప్ప ఇంకెవరూ మహనటి కాలేరు అంటూ చెబుతారు. ఇక ఆమె గురించి విలక్షణ నటుడు ఎస్వి రంగారావు గారు ఏమన్నారో రైటర్ కనగాల జయకుమార్ ఆయన జ్ఞాపకాలను పంచుకున్నారు.
సావిత్రి మహనటి అని చెప్పింది ఆయనే…
ఎస్వి రంగారావు గారు విలక్షణ నటులు, ఏ పాత్రలో అయినా ఇట్టే ఒదిగిపోగల ఆయన సావిత్రి గారి నటన గురించి గొప్పగా మాటాడుతుంటే ఆశ్చర్యపోయానంటూ చెప్పారు జయకుమార్. ఒక సినిమా షూటింగ్ సమయంలో ఖాళీగా కూర్చున్నపుడు మాటల సందర్భంలో సావిత్రిగారి ప్రస్తావన రాగా ఆయన రెండు చేతులు పైకిత్తి దండం పెట్టి సావిత్రి గారి నటనను పొగిడారు. ఆమె మహానటి అంటూ ప్రశంశించారు. అప్పటి వరకు ఆమె అభినయం గమనించని నేను ఆయన చెప్పిన తరువాత సినిమాల్లో ఆమె అభినయం గమనించాను.
ఆమె కళ్ళతోనే పలికే హావభావాలు గమనించినపుడు నిజంగానే ఎస్విఆర్ గారు చెప్పినట్లు ఆమె మహానటి అనిపించింది. ఒకవైపు మాయాబజర్ లో శశిరేఖ, మరోవైవు దేవదాస్ లో పార్వతి ఇలా ఎక్కడ సావిత్రి నటన నచ్చింది అంటే చెప్పలేము అంటూ అలా చాలా సినిమాలు ఉన్నాయ్, ఆమె మహానటి అందుకే అయింది. ఆమె స్థానం ఇంకెవరూ అందుకోలేరు అంటూ జయకుమార్ తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…