Writer Ramesh reddy : సినిమాల్లో నటుడుగా, రైటర్ గా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి రమేష్ రెడ్డి గారు. ఎక్కువగా డైరెక్టర్ హరీష్ శంకర్ తో కలిసి సినిమాలకు పని చేసిన రమేష్ రెడ్డి గారు హరీష్ శంకర్ కు బాగా సన్నిహితుడు. హరీష్ శంకర్ అసోసియేట్ డైరెక్టర్ గా ఉన్నపటినుండి ఇద్దరికీ పరిచయం ఉండటం వల్ల అప్పటి నుండే ఇద్దరూ కలిసి పనిచేయాలని అనుకునేవారు. ఇక బాలకృష్ణ, వెంకటేష్ వంటి హీరోలతోనే కాకుండా రవితేజ, గోపీచంద్ వంటి హీరోలతో మంచి బాండ్ ఉన్న రమేష్ రెడ్డి గారు ఏవైనా మంచి కథలు దొరికితే రవి తేజ, గోపీచంద్ కి మొదట చెప్తారట. ఇక స్క్రిప్ట్ విన్నప్పుడే అది హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో రమేష్ రెడ్డి గారు చెప్పేస్తారట అందుకే అయనను రెబెల్ రమేష్ అని పిలుస్తారట. ఇక ఇండస్ట్రీ లో జరిగే చిన్న చిన్న గొడవల గురించి అయన వివరించారు.
మొహాన్ బాబు, బ్రహ్మానందం గొడవ…
బ్రహ్మానందం, బాబుమోహన్, కోటా ఇలా కొందరు కెరీర్ లో పీక్స్ లో ఉండే సమయంలో ప్రతి సినిమాలోనూ వాళ్ళ కామెడీ ట్రాక్ ఉండేది. ఏక కాలంలో దాదాపు నలుగురు సినిమాలను వాళ్ళు చేసేవారు. అలాగే వాళ్లకు కామెడీ ట్రాక్ లను నేను గోపి మోహన్ రాసేవాళ్లం అంటూ రమేష్ రెడ్డి తెలిపారు. అలా జగపతి బాబు భలే బుల్లోడు ఒకవైపు మోహన్ బాబు పెద రాయుడు ఒకవైపు రాసాం.
పెద రాయుడు షూటింగ్ అపుడు బ్రహ్మానందం, బాబూ మోహన్ భలే బుల్లోడు షూటింగ్ ఉందని అపద్దం చెప్పి పెద రాయుడు షూటింగ్ నుండి వెళ్లిపోయారు. రెండు సినిమాలకు నేనే పనిచేస్తుండటం వల్ల డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి నన్ను పిలిచి షూటింగ్ రేపు ఆ సినిమా ఉందా అనడిగారు. వీళ్ళు అపద్ధం చెప్పిన విషయం తెలియక లేదని చెప్పాను. మోహన్ బాబు గారికి ఫోన్ చేసి డైరెక్టర్ విషయం చెప్పారు. బ్రాహ్మనందం గారికి, మోహన్ బాబు గారికి పెద్ద గొడవ జరిగింది. ఇక నా కెరీర్ పోయినట్లే అనుకున్నాను. నాకు సంబంధం లేని విషయం వల్ల నా పని అయిపోయింది అనుకున్నా, ఆ తరువాత చాలా రోజులు బ్రహ్మానందం గారు మాట్లాడలేదు. నా ముఖం చూడటానికి కూడా ఇష్టపడలేదు. చాలా కాలం తరువాత అపార్థం తొలగింది అంటూ చెప్పారు రమేష్ రెడ్డి.
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…
అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం దేశ రాజకీయాల్లో అత్యంత ప్రభావశీల నాయకుడిగా కొనసాగుతున్న డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశంపై…
ఈ రోజుల్లో మనం దుస్తులు కొనేటప్పుడు ఎక్కువ సమయం రంగు, డిజైన్ లేదా ధర గురించి ఆలోచిస్తాం. కానీ వాటన్నింటికంటే…