Yadama Raju: ప్రస్తుత కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలెబ్రెటీలో తొందరగా ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకోవడం అంతే తొందరగా విడాకులు తీసుకొని విడిపోవడం జరుగుతుంది. అయితే జబర్దస్త్ కమెడీయన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి యాదమ్మ రాజు గత ఏడాది స్టెల్లా అనే అమ్మాయిని వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారు.
ఈ విధంగా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉంటూ ఒకవైపు బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటున్న మరోవైపు యూట్యూబ్ ఛానల్ ద్వారా అభిమానులను సందడి చేస్తున్నటువంటి యాదమ్మ రాజు స్టెల్లా విడాకులు తీసుకోబోతున్నారంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలా వీరి విడాకుల గురించి వార్తలు రావడంతో ఒక్కసారిగా అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వీరిద్దరి వివాహం జరిగి ఏడాది కూడా కాకుండానే విడాకులు తీసుకోవడం ఏంటి అని కంగారు పడుతున్నారు. అయితే ఇది నిజం కాదని ఒక కార్యక్రమం కోసం ఇలా విడాకులు అనే కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారనే విషయం తెలియడంతో ఒక్కసారిగా బుల్లితెర కార్యక్రమం పై నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పెళ్లి చేసుకుని ఎంతో సంతోషంగా ఉన్నటువంటి వీరిద్దరు విడాకులు తీసుకున్నారని చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇంతకీ ఏం జరిగిందనే విషయానికి వస్తే బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ప్రతివారం ఏదో ఒక స్పెషల్ కాన్సెప్ట్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తారు. అయితే తాజాగా విడాకులు ద్వారా వచ్చారు. ఇందులో భాగంగా తాజాగా విడుదల చేసిన ప్రోమోలో యాదమ్మ రాజు స్టెల్లా మధ్య గొడవ జరగడంతో విడాకులు తీసుకుందామని ఫిక్స్ అవుతారు. అయితే పెళ్లి ఎంత గ్రాండ్ గా జరిగిందో విడాకులు కూడా అంతే గ్రాండ్గా జరగాలి అంటూ స్టెల్లా చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో నేటిజన్స్ మండిపడుతున్నారు.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…