Yadamma Raju: యాదమ్మ రాజు కొద్ది రోజుల క్రితం ప్రమాదానికి గురైన విషయం మనకు తెలిసిందే. ఈయన ప్రమాదంలో భాగంగా కాలికి బాగా దెబ్బ తగలడంతో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అయితే ఈయన హాస్పిటల్ లో ఉన్నటువంటి కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు యాదమ్మ రాజుకు ఏమైంది ఎందుకు ఇలా ఉన్నఫలంగా హాస్పిటల్ బెడ్ పై ఉన్నారు అంటూ పలువురు సందేహాలను వ్యక్తం చేశారు.
ఇక హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి ఈయన బయటకు వచ్చిన ప్రతిసారి స్టిక్ సహాయంతో నడుస్తూ పలు సినిమాల ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఈయన తాజాగా బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు నటించిన స్లండాగ్ హస్బెండ్ సినిమాలో నటించారు. తనకు ప్రమాదం జరిగినప్పటికీ సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఇంటర్వ్యూలకు హాజరయ్యారు.
ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈయన తనకు జరిగిన ప్రమాదం గురించి తెలిపారు. రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి బైక్ స్కిడ్ కావడంతో బైక్ వచ్చి నాపై పడిందని అందుకే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో తన కాలు దెబ్బతిందని కుడికాలు వేలు తొలగించారని తెలిపారు. ఇలా కాలు వేలు తొలగించే సమయంలో తొడపై ఉన్నటువంటి చర్మం తీసి ఇక్కడ వేశారు.
ఆ సమయంలో భరించలేనటువంటి బాధను అనుభవించానని తెలిపారు.ఇలా సర్జరీ చేస్తుంటే ప్రాణం పోయినంత పని అయిందని ఈ సందర్భంగా తాను అనుభవిస్తున్నటువంటి నొప్పిని తలుచుకొని ఎమోషనల్ అయ్యారు. ఇక ఒక ఆర్టిస్ట్ గా సినిమాలలో నటించడం వల్ల ప్రమోషన్ చేయాల్సిన బాధ్యత ఉంది కనుక తాను ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొంటున్నాను అంటూ ఈ సందర్భంగా యాదమ్మ రాజు చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
తెలుగు ఇంటి వంటల్లో ఊరగాయకు ఉన్న స్థానం ప్రత్యేకం. వేడివేడి అన్నంలో ఒక ముద్ద పచ్చడి ఉంటే చాలు, భోజనానికి…
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, ఉద్యోగాలు, వ్యాపార ప్రయాణాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక నగరం నుంచి మరో నగరానికి, ఒక దేశం…
ప్రస్తుతం ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ బరోడా…
తెలంగాణలో క్రికెట్కు మరింత ప్రోత్సాహం అందించే లక్ష్యంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ20 లీగ్ ప్రారంభానికి సర్వం…
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్గా, నటిగా సుపరిచితమైన విష్ణుప్రియ భీమినేని మరోసారి వార్తల్లో నిలిచారు. టెలివిజన్ షోలు, రియాలిటీ కార్యక్రమాలు,…
వ్యవసాయం అనేది దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక. రైతు సంతోషంగా ఉంటేనే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. అయితే…